ఈ మధ్య కాలంలో వచ్చి రాని వైద్యంతో చాలామంది చలామణి అవుతున్నారు.ముఖ్యంగా డబ్బుల కోసం అడ్డదారులు తొక్కుతున్నారు.వచ్చీరాని వైద్యంతో చికిత్స చేసి రోగుల ప్రాణాలు తీస్తుంటారు. ఇలాంటి ఘటనలు రోజూ ఎక్కడో చోట జరుగుతూనే ఉంటాయి. అయితే ఒడిశాలో విచిత్ర ఘటన చోటు చేసుకుంది. ఆస్పత్రిలో వైద్యుడు లేని సమయంలో ఓ వ్యాపారి చికిత్స కోసం వెళ్లాడు. ఆ సమయంలో వైద్యుడి భార్య ఒక్కటే ఉంది. చివరకు భర్తకు తెలీకుండా భార్య చేసిన పని.. స్థానికంగా తీవ్ర సంచలనం సృష్టించింది. వివరాల్లోకి వెళితే..


ఒడిశా మల్కన్‌గిరి జిల్లా కలిమెల సమితి ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకుంది. స్థానిక ప్రాంతానికి చెందిన తపస్ పాల్ అనే వ్యక్తి గత కొద్ది రోజులుగా పంటి నొప్పి తో బాధపడుతున్నాడు. దీంతో శుక్రవారం కలిమెలలో ఉంటున్న వైద్యుడు రవీంద్రనాథ్ బిస్వాస్ క్లినిక్‌కు వెళ్లాడు. అయితే ఆ సమయంలో వైద్యుడు బయటికి వెళ్లాడు. క్లినిక్‌ లో వైద్యుడి భార్య మాత్రమే ఉంది. వ్యాపారి సమస్య తెలుసుకున్న ఆమె.. తాను కూడా చికిత్స చేస్తానని చెప్పింది. అనంతరం వ్యాపారిని ఆపరేషన్ థియేటర్‌కి తీసుకెళ్లి పరీక్షించింది. ఏమాత్రం అవగాన లేకుండా పన్ను పీకేసింది..


దాంతో అతనికి తీవ్ర రక్తస్రావం అయ్యింది.అనంతరం మెరుగైన చికత్స కోసం మరో ఆస్పత్రికి తరలించారు. అయితే అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందాడు. మృతుడు డయాబెటిక్, రక్తపోటుతో బాధపడుతున్నట్లు తెలిసింది. వైద్యంపై అవగాహన లేని వైద్యుడి భార్య.. అతడికి ఎలాంటి పరీక్షలు చేయకుండానే పన్ను పీకేసినట్లు తెలిసింది. వ్యాపారి మృతి వార్త తెలియగానే.. వైద్యుడు, అతడి భార్య పరారయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. పరారీ లో ఉన్న వారి కోసం గాలిస్తున్నారు.. ఈ ఘటన గురించి పూర్తీ వివరాలు తెలియాల్సి ఉంది..


మరింత సమాచారం తెలుసుకోండి: