కొంతమంది ఇక ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించిన ప్రియుడే మోసం చేయడాన్ని జీర్ణించుకోలేక చివరికి అక్కడితో జీవితం అయిపోయింది అని భావిస్తూ తల్లిదండ్రుల గురించి ఆలోచించకుండా ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. ఇక్కడ ఇలాంటి తరహా ఘటన వెలుగులోకి వచ్చింది అని చెప్పాలి. నన్ను ప్రేమించి ఇంకొకరిని ఎలా పెళ్లి చేసుకుంటావు. నన్ను కాదంటే పెళ్లి చెడగొడుతా అంటూ ఓ యువకుడు వేధించడంతో ఆందోళనకు గురైన యువతి చివరికి ఆత్మహత్యకు పాల్పడింది. మెహబూబ్ నగర్ జిల్లా చిన్నచింతకుంట మండలంలో ఈ ఘటన వెలుగు చూసింది అని చెప్పాలి. ఉంద్వాలా గ్రామ తాండకు చెందిన అంజమ్మ,హనుమంతు దంపతులకు 19 ఏళ్ల పుష్పలత ఒక్కగానొక్క కూతురు.
అయితే తండ్రి చనిపోవడంతో ఇక పుష్పలత టైలరింగ్ చేస్తూ వచ్చిన డబ్బులతో కుటుంబ పోషణ చూసుకుంటుంది. అయితే అదే తండాకు చెందిన సాయి సందీప్ నాయక్ తో పుష్పలత గత కొంతకాలం నుంచి ప్రేమలో ఉంది. ఈ విషయం తెలియని కుటుంబ సభ్యులు పుష్పలతకు వేరే వ్యక్తితో పెళ్లి నిశ్చయించుగా వచ్చే నెలలో వివాహం జరగాల్సి ఉంది. అప్పటివరకు ఇక నువ్వంటే ప్రాణం అంటూ చెప్పిన ప్రియుడు ఇక ఆమెను వేధించడం మొదలుపెట్టాడు. నన్ను ప్రేమించి వేరొకని ఎలా పెళ్లి చేసుకుంటావు అంటూ సూటిపోటి మాటలతో వేధించాడు. నన్ను చేసుకోకపోతే మన ఇద్దరం కలిసి దిగిన ఫోటోలను సోషల్ మీడియాలో పెడతానంటు బ్లాక్ మెయిల్ చేయడం మొదలుపెట్టాడు. తీవ్ర మనోవేదనకు గురైన యువతి చివరికి బలవన్మరణానికి పాల్పడింది. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.