విధి ఆడే వింత నాటకంలో మనుషుల జీవితాలు కేవలం కీలుబొమ్మలాంటివే అని ఎంతో మంది పెద్దలు చెబుతూ ఉంటారు. అయితే ఇవన్నీ ఒట్టి మాటలే. ఒకప్పుడు పెద్దలు ఏదో మాట వరసకు అలా చెప్పేవారు అని నేటి రోజుల్లో జనాలు లైట్ తీసుకుంటూ ఉంటారు. కానీ వెలుగులోకి వచ్చే కొన్ని ఘటనల గురించి తెలిసిన తర్వాత మాత్రం పెద్దలు చెప్పింది నిజమే అనే భావన ప్రతి ఒక్కరిలో కలుగుతూ ఉంటుంది. ఎందుకంటే విధి ఆడే వింత నాటకంలో మనిషి జీవితం ఎప్పుడు ముగుస్తుంది అన్నది ఊహకందని రీతిలోనే ఉంటుంది.



 అంతా సంతోషంగా సాగిపోతుంది అనుకుంటున్న సమయంలో ఊహించని రీతిలో మృత్యువు దరిచేరుతూ ఉంటుంది. దీంతో ఇక కుటుంబం మొత్తం శోకంలో మునిగిపోయే పరిస్థితి వస్తూ ఉంటుంది అన్న విషయం తెలిసిందే. అయితే విధి ఆడిన వింత  నాటకంలో మనుషులు కీలుబొమ్మలు మాత్రమే అనే మాటకు నిదర్శనంగా ఇక్కడ వెలుగులోకి వచ్చిన ఘటన జరిగింది. ఏకంగా పెళ్లికి మరో రెండు రోజులే సమయం ఉండగా.. పెళ్లి కొడుకు చివరికి ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటన వరంగల్ జిల్లాలో వెలుగులోకి వచ్చింది అని చెప్పాలి.



 రామన్నపేటలో ఈ విషాదకర ఘటన అందరిని కంటనీరు పెట్టించింది. ఎల్లుండి పెళ్లి పీటలు ఎక్కాల్సిన వరుడు చివరికి దుర్మరణం పాలయ్యాడు. దేవరకొండ సాగర్ చారి అనే 28 ఏళ్ల యువకుడికి పెళ్లి ఫిక్స్ అయింది. మరో రెండు రోజుల్లో పెళ్లి జరగాల్సి ఉంది.  అయితే ఇక వధువు వరుడు కుటుంబ సభ్యులు పెళ్లి పనుల్లో బిజీ బిజీగా ఉన్నారు. పెళ్లి పనుల నిమిత్తం బైక్ పై వెళ్తుండగా వేగంగా దూసుకు వచ్చిన మరో బైక్ ఢీ కొట్టింది. అయితే ఈ ఘటనలో తీవ్ర గాయాలు పాలైన సాగర్ చారి చివరికి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. దీంతో సాగర్ మరణాన్ని జీవించుకోలేకపోయిన కుటుంబ సభ్యులు గుండెలవిసేలా రోధిస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: