చూస్తూ చూస్తుండగానే ఎంతోమంది కళ్ళముందే కుప్పకూలిపోయి.. క్షణంలో ప్రాణాలు వదులుతూ ఉన్నారు. అయితే ఇలాంటి ఘటనల గురించి అందరూ భయాందోళన చెందుతున్న సమయంలో మరికొన్ని అనూహ్యమైన ఘటనలు కూడా మనుషుల ప్రాణాలను గాల్లో కలిపేస్తున్నాయి. ఇక్కడ ఒక యువకుడు విషయంలో ఇలాంటిదే జరిగింది సాధారణంగా స్నేహితులందరికీ కలిసి గోవాకు వెళ్లి ఎంజాయ్ చేయాలని ప్రతి ఒక్క యువకుడు భావిస్తూ ఉంటాడు. గోవాకి వెళ్ళినప్పుడు సముద్ర తీరాన్ని చూస్తూ తెగ ఆనందపడిపోతూ ఉంటాడు అని చెప్పాలి. ఇక్కడ ఒక యువకుడు ఇలాగే చేయాలని అనుకున్నాడు.
ఎంతగానో ఎంజాయ్ చేయాలని భావించి ఇక స్నేహితులతో కలిసి గోవాకు వెళ్ళాడు. కానీ ఆ గోవా టూర్ చివరికి అతని జీవితాన్ని ముగిస్తుంది అని మాత్రం ఊహించలేకపోయాడు. సముద్రపు ఒడ్డున ఉన్న యువకుడు నీటిలోకి దిగిన వెంటనే ఫిట్స్ రావడంతో రావడంతో చివరికి నీటిలో పడి మృతి చెందాడు. ఈ ఘటన మెదక్ జిల్లా శివంపేట మండలం దొంతిలో చోటుచేసుకుంది. మెతుకు హరికృష్ణతోపాటు అతని స్నేహితులు గోవా టూర్ కి వెళ్లారు. అయితే ఇటీవల తిరుగు ప్రయాణం సమయంలో ఇక సముద్రంలో మరోసారి స్నానం చేసేందుకు వెళ్లారు. అయితే హరికృష్ణ హిట్స్ రావడంతో నీటిలో మునిగిపోయాడు. అతని కాపాడేందుకు స్నేహితులకు ప్రయత్నించగా అప్పటికే ప్రాణాలు పోయాయ్. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.