ఒక్కసారి మూడుముళ్ల బంధంతో ఒక్కటైన తర్వాత కట్టుకున్న భార్య బాధ్యతగా మారిపోతూ ఉంటుంది. ఎన్ని కష్టాలు వచ్చినా కట్టుకున్న భార్యకు మాత్రం తోడునీడగా ఉండాలి. కానీ నేటి రోజుల్లో మాత్రం ఇక భార్య భర్తల మధ్య తలెత్తిన చిన్నపాటి గొడవలకే ఎంతోమంది కట్టుకున్న వారి పట్ల కర్కశంగా ప్రవర్తిస్తున్న  ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. ఇక ఇలాంటివి చూస్తుంటే అసలు నేటి రోజుల్లో భార్యాభర్తల బంధానికి విలువ ఉందా అని అనుమానం కలుగకమానదు. ఇక్కడ ఇలాంటి సంఘటన జరిగింది. వారిద్దరూ కోటి ఆశలతో మూడు ముళ్ళ బంధంతో ఒక్కటయ్యారు. వివాహం జరిగి 5 ఏళ్ళు గడిచిపోయాయి. వారికి నాలుగేళ్ల కుమారుడు కూడా ఉన్నాడు



 ఇక కొన్నాళ్లపాటు సంసారం కూడా ఎంతో సాఫీగా సాగిపోయింది. కానీ ఆ తర్వాతే వారి మధ్య మనస్పర్థల తో గొడవలు జరగడం మొదలైంది. నిత్యం ఏదో ఒక కారణంతో ఇద్దరూ గొడవ పాడుతూనే ఉండేవారు. వీరి వ్యవహారం పెద్దల వరకు వెళ్లగా ఎంత నచ్చజెప్పినా తీరులో మాత్రం మార్పు రాలేదు. గొడవలు పడుతూ కలిసి ఉండటం కంటే విడిపోయి సంతోషంగా ఉండటం మేలు అనుకుని విడాకులు తీసుకోవాలని అనుకున్నారు. ఈ క్రమంలోనే విడాకుల కోసం దరఖాస్తు చేసుకున్నారు. కానీ అంతలోనే ఊహించని షాక్ ఇచ్చాడు భర్త. తన భార్యను పెళ్లి చేసుకోండి అంటూ మ్యాట్రిమోనీ సైట్ లో ఒక ప్రకటన చేయడం సంచలనంగా మారిపోయింది.


 ఈ ఘటన తిరువల్లూరు లోని కదంబతూరు లో చోటుచేసుకుంది. యూనియన్ కు చెందిన యువతి ఓం కుమార్ అనే యువకుడిని పెళ్లి చేసుకుంది. 2016లో కుటుంబ సభ్యులు బంధుమిత్రుల సమక్షంలో వీరి పెళ్ళి ఘనంగా జరిగింది. ఇక ప్రస్తుతం వీరికి ఒక కుమారుడు ఉన్నాడు. అయితే గత కొన్ని రోజులుగా వీరి మధ్య గొడవలు ఎక్కువగా జరుగుతున్నాయి. దీంతో విడిపోవాలని అనుకున్నారు. ఇక విడాకుల కోసం దరఖాస్తు చేసుకున్నారు. అయితే అంతలోనే భర్త నీచ బుద్ది చూపించాడు. తన భార్యను పెళ్లి చేసుకోవాలి అంటూ భర్త మ్యాట్రిమోనీ వెబ్సైట్ లో ఒక ప్రకటన చేశాడు. అంతేకాదు యువతి తండ్రి ఫోన్ నెంబర్ కూడా ఇచ్చాడు. ఆ తర్వాత వరుసగా యువతి తండ్రి కి ఫోన్ కాల్స్ రావడం తో అసలు విషయం బయటపడింది. దీంతో అందరూ ఒక్కసారిగా షాకయ్యారు. ఇక యువతి తండ్రి వెంటనే వెళ్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: