ఇలా అక్క పెళ్లయి అత్తారింటికి వెళ్ళిన తర్వాత కూడా ఈ అక్కాతమ్ముళ్ల మధ్య ప్రేమ ఎక్కడా తగ్గలేదు అని చెప్పాలి. ఇక ఇటీవలే వీరి ప్రేమానురాగాలను చూసి విధి ఓర్వ లేక పోయింది. దీంతో అక్కాతమ్ముళ్ల బంధం మధ్య విషాదాన్ని నింపింది. తమ్ముడిని మృత్యు ఒడిలోకి చేర్చింది. రోడ్డు ప్రమాదం లో తమ్ముడు చని పోయాడు. దీంతో అక్క గుండె పగిలిపోయింది. ఇక అంత్యక్రియలకు వచ్చినా ఆమె తమ్ముడు మృతదేహం పడి భోరున విలపించింది. చివరికి అక్కడే ప్రాణాలు వదిలింది. ఈ ఘటన యాదాద్రి భువనగిరి జిల్లా గుడిమల్కాపూర్ లో వెలుగులోకి వచ్చింది.
సయ్యద్ షరీఫ్ అనే 20 ఏళ్ల యువకుడు రోడ్డు ప్రమాదం లో మరణించాడు. అతడి బాబాయ్ కూతురు షేక్ ఖాదర్బి తమ్ముడు అంత్యక్రియలకు హాజరైంది. ఈ క్రమం లోనే షరీఫ్ మృతదేహం పడి విలపించింది. ఈ క్రమం లోనే తమ్ముడు మృతదేహం పైనే గుండె ఆగిపోయింది. అలాగే ప్రాణాలు వదిలింది అక్క. దీంతో అక్కడున్న వారందరూ ఒక్కసారిగా షాకయ్యారు. వెంటనే సదరు మహిళను ఆసుపత్రికి తరలించగా పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్లు నిర్ధరించారు. ఈ ఘటన కాస్తా సంచలనంగా మారింది..