ఓ మహిళ ఓ వ్యక్తిని గుడ్డిగా నమ్మింది. ప్రేమించాను పెళ్లి చేసుకుంటాను అని చెప్పడంతో అతనికి సర్వస్వం ధారపోసింది. కొన్నాళ్లపాటు సహజీవనం చేస్తోంది. ఈ క్రమంలోనే ఎనిమిదేళ్లలో 14 సార్లు గర్భం దాల్చగా అబార్షన్ చేయించాడు సదరు వ్యక్తి. ఇక ఇప్పుడు పెళ్లి చేసుకోమని అడిగితే ముఖం చాటేశాడు. దీంతో ఎంతో మనో వేదనకు గురైన సదరు మహిళ చివరికి ఆత్మహత్యకు పాల్పడింది. ఈ విషాదకర ఘటన దేశ రాజధాని ఢిల్లీలో వెలుగులోకి వచ్చింది. సదరు మహిళకు అప్పటికే పెళ్లయింది. కానీ మనస్పర్థల తో భర్తకు దూరంగా ఉంటుంది. ఈ క్రమంలోనే ఒంటరిగా ఉంటున్న 33 ఏళ్ల బాధితురాలితో బీహార్కు చెందిన గౌతం అనే వ్యక్తికి పరిచయం ఏర్పడింది.
ఈ క్రమంలోనే వీరి మధ్య పరిచయంలో కాస్త చనువు పెరిగింది. ఇక పెళ్ళి చేసుకుంటాను అంటూ నమ్మించాడు సదరు వ్యక్తి. ఎనిమిదేళ్లుగా సహజీవనం చేస్తూ ఉండగా మహిళకు 14 సార్లు గర్భం వచ్చింది. ఏదో ఒక మాయ మాటలు చెప్పి 14 సార్లు అబార్షన్ చేయించాడు. ఇటీవలే పెళ్లి చేసుకోమని అడిగితే నిరాకరించాడు. దీంతో ఆమె ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఆమె దుస్తుల్లో సూసైడ్ నోట్ గుర్తించారు పోలీసులు. అతడు చేసిన తప్పుల కు సంబంధించిన అన్ని ఆధారాలను కూడా సేకరించారు. నా సెల్ ఫోన్ లో చెక్ చేయండి అంటూ ఇక ఆమె రాసిన నోట్లో ఉంది. ఈ క్రమంలోనే దర్యాప్తు చేపట్టారు పోలీసులు.