గురుగ్రమ్ జిల్లాలోని ఫరీదాబాద్ గ్రామంలో 32 ఏళ్ల వ్యక్తిని ఓ మహిళ కుటుంబం దారుణంగా కొట్టి చంపారు. అతని స్నేహితుడి పై కూడా కర్రలు ఇనుపరాట్లతో దాడి చేశారు. తీవ్రంగా గాయపడ్డ అతను ప్రస్తుతం ఆస్పత్రిలో కొనప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్నాడు.. మోహిత్ అతని స్నేహితుడు నవీన్ కారులో తాగుతుండగా భూపానిలో 28 ఏళ్ల యువతి కుటుంబ సభ్యులు బంధువులు వారిని చుట్టుముట్టి దారుణంగా కర్రలు రాళ్లతో దాడి చేశారు. అయితే సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకునేంతవరకు కూడా ఆ ఇద్దరినీ దారుణంగా కొడుతూనే ఉన్నారు. ఇక ఆ తర్వాత వేధింపులకు సంబంధించి ఫిర్యాదు చేసేందుకు మహిళ సహా ఆమె కుటుంబ సభ్యులు పోలీస్ స్టేషన్కు వెళ్లారు.
వేధింపులకు పాల్పడటమే కాక పోలీసులకు ఫిర్యాదు చేస్తే చంపేస్తామని బెదిరిస్తున్నారని ఇక బాధిత కుటుంబం పోలీస్ ఫిర్యాదులో పేర్కొంది. అయితే మోహిత్ కు గతంలోనే నేర చరిత్ర ఉందని అతనిపై అనేక కేసులు పెండింగ్లో ఉన్నాయని పోలీసులు కూడా గుర్తించారు. అదే సమయంలో ఇక మోహిత్ సహా తన స్నేహితుని కొట్టిన మహిళా కుటుంబ సభ్యులు నలుగురిపై కేసు నమోదు చేశారు పోలీసులు. ఇక ఇందులో ఒకరు పరారీలో ఉండగా అతని కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఈ ఘటన కాస్త స్థానికంగా సంచలనగా మారిపోయింది అని చెప్పాలి.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి