అయితే.. ఇవి ఇప్పటి వరకు కూడా మాటలు గానే మిగిలిపోయాయి. ఇప్పటి వరకు చేతల రూపంలో ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేదు. దీనిపైనే మేధావులు సైతం దృష్టి పెట్టారు. ప్రస్తుతం ఉన్న మూడు కీలక పార్టీలను చూసుకుంటే.. టీడీపీ, వైసీపీలు.. యువత వైపే అడుగులువేస్తున్నాయి. ఈ క్రమంలో జనసేన కూడాయువ జపం చేస్తోంది. బాగానే ఉంది. కానీ.. జిల్లాల్లో యువతను ముందుండి నడిపించే నాయకులు ఏరీ.. దీనికి సంబంధించిన వ్యూహం ఏంటి? యువతను ఏవిధంగా ముందుకు నడిపిస్తారు? అనేది ఆసక్తిగా మారింది.
అంతేకాదు.. బూత్ స్థాయిలో కమిటీలను ఏర్పాటు చేసుకోవాలి.. మండల స్థాయిలో నాయకులను తయారు చేసుకోవా లి.. అదేవిధంగా నగరాలు.. పట్టణాల స్థాయిలో వార్డుల్లో పార్టీని బలోపేతం చేసుకోవాలి. ఇలా చేసుకున్నాక.. వారిని మరింత వేగంతో ప్రజల మధ్యకు తీసుకువెళ్లాలి. ఇదీ.. ఎన్నికల్లో విజయం దక్కించుకునేందుకు అనుసరించాల్సిన వ్యూహం. కానీ.. జనసేనలో ఎక్కడా బూత్ లెవిల్ కమిటీలు లేవు. అంతేకాదు.. మండల, గ్రామ స్థాయి కమిటీలు కూడా కనిపించడం లేదు.
దీనిని బట్టి.. పార్టీ ఏవిధంగా ముందుకు సాగుతుందనేది ప్రశ్న. లక్ష్యం మంచిదే అయినా.. దానిని సాధించుకునేందుకు అనుసరించాల్సిన వ్యూహాన్ని కూడా అదే రేంజ్లో అమలు చేయాలికదా.. అంటున్నారు పరిశీలకులు. ఆవిర్భావ సభలో పవన్ చెప్పిన ఏదీ కూడా ఇప్పటి వరకు అమలుకు నోచుకోలేదు. ఇలా అయితే.. ముందుకు సాగేనా..అనేది పార్టీలోనూ వినిపిస్తున్న గుసగుస. మరి పవన్ ఏం చేస్తారో చూడాలి.