రాష్ట్రంలోని ప్రతి హెల్త్ సెంటర్ లో రాపిడ్ టెస్ట్ లు నిర్వహించేలా కిట్స్ సిద్ధం చేస్తున్నామని.. గతంలో కోవిడ్ కంట్రోల్ లో ఏపీ రోల్ మోడల్ గా నిలిచిందని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి విడదల రజని అన్నారు. కొత్త వేరియంట్ వచ్చినా ఎదుర్కొనడానికి సిద్ధంగా ఉన్నామని.. టెస్టింగ్, ట్రాకింగ్, ట్రీట్మెంట్ చేస్తామని.. ఇందుకు రాష్ట్రంలో 29 లాబ్స్ ఉన్నాయని మంత్రి విడదల రజని తెలిపారు.
వాలంటీర్ వ్యవస్థను కోవిడ్ నియంత్రణలో వాడుకుంటామన్న మంత్రి విడదల రజని.. అన్ని హాస్పటల్ ను అలెర్ట్ చేశామన్నారు.
ఆక్సిజన్ సరఫరా ఇబ్బందులు లేకుండా చూస్తామని మంత్రి విడదల రజని తెలిపారు. ఈ కొత్త వేరియంట్ కొన్ని రాష్ట్రాలు నమోదు అయ్యాయని.. అయినంత మాత్రాన ఆందోళన అవసరం లేదని మంత్రి విడదల రజని భరోసా ఇచ్చారు. అయితే.. ఎవరూ అజాగ్రత్తగా ఉండవద్దని.. పిపిఈ కిట్స్, మాస్క్, శానిటర్లు కొరత లేకుండా చూస్తామని మంత్రి విడదల రజని అన్నారు. చలికాలంలో కోవిడ్ వ్యాపి చెందే అవకాశం ఉందని.. అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని.. అనవసరంగా ఎవరూ భయపడవద్దని మంత్రి విడదల రజని సూచించారు. ఏదేమైనా మళ్లీ కరోనా కాలం వచ్చింది. జాగ్రత్తగా ఉండటం బెటర్.