అక్కడ ఎస్సీ, ఎస్టీ, మైనార్టీల సాలిడ్ ఓటింగ్ అనేది ఆవిడకు పనికి వచ్చింది. ఆవిడ బీసీ వర్గానికి చెందిన వ్యక్తి కాబట్టి బీసీల్లో ఒక సెక్షన్ కూడా ఆవిడకి ఓటేశారు. ఇక అక్కడ పత్తిపాటి పుల్లారావు మళ్లీ పోటీ చేయడానికి 25 నుండి 30 కోట్లు పెడితే మరొక ఎన్నారై 75 నుండి 80 కోట్ల వరకు పెడుతున్నట్టుగా తెలుస్తుంది. ఆయనను నారా లోకేష్ ప్రోత్సహిస్తున్నట్టుగా తెలుస్తుంది. అయితే అకస్మాత్తుగా నందమూరి సుహాసిని పేరు తెరపైకి వచ్చింది.
కూకట్ పల్లికి చెందిన చుండ్రు కుటుంబానికి కోడలు నందమూరి సుహాసిని. హరికృష్ణ కుమార్తె అయిన ఈవిడని ఇప్పుడు నందమూరి అనే ట్యాగ్ తోనే పిలుస్తున్నారు. ఇప్పుడు నందమూరి బాలకృష్ణ గారి కూతురు బ్రాహ్మణి, నారా చంద్రబాబు నాయుడు గారి కొడుకు నారా లోకేష్ ని పెళ్లి చేసుకుంటే నారా బ్రాహ్మణి అయింది. కానీ నందమూరి హరికృష్ణ గారి కూతురు సుహాసిని, చుండ్రు శ్రీహరి గారి కొడుకు ని పెళ్లి చేసుకుంటే మాత్రం నందమూరి సుహాసిని గానే పిలవబడుతుంది. ఇది ఒక విచిత్రం. అయితే నందమూరి సుహాసినీని ఇక్కడ అభ్యర్థిగా పెడతారని ప్రచారం జరుగుతుంది. ఆ ప్రచారం అంత నమ్మదగ్గదీకాదు. ఎందుకంటే గెలవడం అనేది కొత్త వాళ్ళకు అక్కడ అంత ఈజీ కాదు.