ఏపీలో రేషన్ కార్డు కల్గిన పేదలకు ఇకపై చౌక బియ్యంతో పాటు రాగులు, జొన్నలు పంపిణీ చేయాలని ఏపీ సర్కారు నిర్ణయించింది. ఈ మేరకు పౌర సరఫరాల శాఖ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు తెలిపారు. తొలుత రాయలసీమ జిల్లాల్లో రాగులు, జొన్నలు పంపిణీ చేసి దశలవారీగా రాష్ట్రమంతా విస్తరిస్తామని మంత్రి కారుమూరి నాగేశ్వరరావు అన్నారు. రేషన్ కార్డు దారులకు రాగులు, జొన్నలు తీసుకునే విషయమై వాలంటీర్లతో సర్వేలో చేశామని మంత్రి కారుమూరి నాగేశ్వరరావు వివరించారు.


ఈ సర్వేలో రేషన్ కార్డుదారులందరూ కావాలని కోరినట్లు మంత్రి కారుమూరి నాగేశ్వరరావు తెలిపారు. కందిపప్పు బాగోలేదని చాలా మంది ఫిర్యాదు చేశారని, బండి వద్దే కందిపప్పును  ఉడకబెట్టి నాణ్యత పరిశీలించాలని ఆదేశించినట్లు  మంత్రి కారుమూరి నాగేశ్వరరావు తెలిపారు. నాసిరకం పప్పు ఇచ్చిన వారిపై విచారణ కొనసాగుతుందని మంత్రి కారుమూరి నాగేశ్వరరావు తెలిపారు. లోపాలు ఉంటే ..వారిపై చర్యలు తీసుకుంటామని మంత్రి కారుమూరి నాగేశ్వరరావు అన్నారు.


గతంలో ఎప్పుడూ లేని విధంగా ధాన్యం సేకరిస్తున్నామన్న మంత్రి కారుమూరి నాగేశ్వరరావు.. రైతులకు మద్దతు ధర ప్రకటించి అమలు చేశామని తెలిపారు. ధాన్యం కొనుగోళ్లకు సంబంధించి 90శాతం చెల్లింపులు చేశామన్న మంత్రి కారుమూరి నాగేశ్వరరావు... 21 రోజులల్లోపే ధాన్యం సేకరణ కు సంబంధించి సొమ్ములు చెల్లిస్తున్నామన్నారు. సీఎం జగన్ రైతులకు పెద్దపీట వేసి పెద్దఎత్తున మేలు చేస్తుంటే  వెంట్రుక వాసి లోపాలను పెద్దవిగా చేసి చూపవద్దని మంత్రి కారుమూరి నాగేశ్వరరావు కోరారు. ధాన్యం సేకరణలో  అక్కడక్కడ రైస్ మిల్లర్ల వల్ల సమస్యలు వచ్చాయని అంగీకరించిన మంత్రి కారుమూరి నాగేశ్వరరావు...  ఇప్పటికే మూడు రైస్ మిల్లులను సీజ్ చేశామన్నారు.  


అవకతవకలకు పాల్పడిన వారిపై క్రిమినల్ కేసులు పెట్టాలని సీఎం ఆదేశించినట్లు మంత్రి కారుమూరి నాగేశ్వరరావు తెలిపారు.  రైతు పండించిన  ప్రతి గింజనూ సేకరిస్తున్నామన్న మంత్రి కారుమూరి నాగేశ్వరరావు.. రంగుమారిన ధాన్యాన్ని మార్చి15 లోపు కొనాలని నిర్ణయించినట్లు తెలిపారు.  


మరింత సమాచారం తెలుసుకోండి: