
భారతీయ రైల్వే నిరుద్యోగుల
కోసం 1937 పారామెడికల్ కేటగిరిలో
ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ నోటిఫికేషన్ లో భాగంగా వివిధ రాష్ట్రాలలో ఖాళీగా ఉన్న పోస్టులతో కూడిన
వివరాలు వెల్లడించారు. ఈ పోస్టులు అన్నీ ఆయా రాష్ట్రాల ఆర్ఆర్బీల ద్వారా భర్తీ
చేయనున్నారు.
ఆర్ఆర్బీల వారీ ఖాళీలు: అహ్మదాబాద్-80,
అజ్మీర్-89, అలహాబాద్-176,
బెంగళూరు-51,
భోపాల్-48, భువనేశ్వర్-35,
బిలాస్పూర్-40,
చంఢీగఢ్-197,
చెన్నై-173, గోరఖ్పూర్-66,
గువాహటి-117,
జమ్మూ-శ్రీనగర్-70, కోల్కతా-236, మాల్దా-45, ముంబై-232, ముజఫర్పూర్-26, పట్నా-76, రాంచీ-38, సికింద్రాబాద్-112, సిలిగురి-30.
అర్హత: పోస్టులను బట్టి సంబంధిత విభాగంలో బీఎస్సీ, పీజీ డిప్లొమా, ఎంఎస్సీ, డిప్లొమా, గ్రాడ్యుయేషన్, ఇంటర్/తత్సమాన ఉత్తీర్ణత.
వయసు: పోస్టులను బట్టి 18-40 ఏళ్ల మధ్య ఉండాలి. రిజర్వేషన్
అభ్యర్థులకు వయో సడలింపు ఉంటుంది.
ఎంపిక: కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ (సీబీటీ) ఆధారంగా.
దరఖాస్తు విధానం: ఆన్లైన్లో.
దరఖాస్తు ఫీజు: రూ.500. రాయితీ వర్తించే వర్గాలకు రూ.250.
రిజిస్ట్రేషన్కు చివరితేదీ: ఏప్రిల్ 2,
2019.
దరఖాస్తుకు చివరితేదీ: ఏప్రిల్ 7,
2019.
పూర్తి వివరాలకు వెబ్సైట్: http://rrbsecunderabad.nic.in