ముఖ్య సంఘటనలు
2009: మహిళల ప్రపంచ కప్ క్రికెట్ టోర్నమెంటు ఆస్ట్రేలియాలో ప్రారంభమైనది.
2011: యాదగిరి గుట్ట బ్రహ్మోత్సవాలు ప్రారంభం.
ప్రముఖుల జననాలు..
1921: ఎమ్మెస్ రామారావు, తెలుగు చలనచిత్ర చరిత్రలో మొట్టమొదటి నేపథ్య గాయకుడు. (మ.1992)ఈయనకు సుందర దాసు అనే బిరుదు ఉంది. ఈయన తెలుగు చలనచిత్ర చరిత్రలో మొట్టమొదటి నేపథ్య గాయకుడు. 1944 లో ప్రఖ్యాత సినీ దర్శక నిర్మాత వై.వి.రావు తన తాహసీల్దార్ చిత్రంలో ఎమ్మెస్ చేత మొదటి సారిగా ఈ రేయి నన్నొల్ల నేరవా రాజా అనే ఎంకి పాట పాడించాడు. గేయ రూపంలో ఈయన రచించి గానం చేసిన రామయణ భాగం సుందరకాండము ఎమ్మెస్ రామారావు సుందరకాండ గా సుప్రసిద్ధం. తులసీదాసు రచించిన హనుమాన్ చాలీసాను తెలుగులోకి అనువదించి ఆకాశవాణిలో పాడారు. ఈ రెండూ ఈయనకు మంచి గుర్తింపును, ఖ్యాతిని తెచ్చిపెట్టాయి.
1938: డేవిడ్ బాల్టిమోర్, అమెరికా జీవశాస్త్రవేత్త నోబుల్ బహుమతి గ్రహీత జననం.
1952: వివియన్ రిచర్డ్స్, వెస్టీండీస్ క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్.ఇతడు వెస్ట్ఇండీస్కు చెందిన ప్రముఖ క్రికెట్ క్రీడాకారుడు. 2002లో వివ్ రిచర్డ్స్ వన్డేలలో సర్వకాల అత్యున్నత బ్యాట్స్మెన్గా గుర్తించబడ్డాడు. కాని 2003లో భారత్కు చెందిన సచిన్ టెండుల్కర్కు ప్రథమస్థానం ఇచ్చి ఇతనికి ద్వితీయస్థానంతో సరిపెట్టారు. 1991లో అంతర్జాతీయ క్రికెట్ నుంచి నిష్క్రమించాడు.
1955: అనుపమ్ ఖేర్, సినీ నటుడు జననం.
ప్రముఖుల మరణాలు..
1952: పరమహంస యోగానంద, భారతదేశంలో గురువు. (జ.1893)అతను జన్మనామం ముకుంద లాల్ ఘోష్. అతను రాసిన ఒక యోగి ఆత్మకథ అనే ఆధ్యాత్మిక రచన అనేక ప్రతులు అమ్ముడై సంచలనం సృష్టించింది.
1973: అప్పడవేదుల లక్ష్మీనారాయణ, భారతదేశానికి చెందిన ఖగోళ శాస్త్రవేత్త. కొడైకెనాల్ లోని సూర్య దర్శిని విభాగపు మొదటి అధ్యక్షుడు.
1979: అయ్యంకి వెంకటరమణయ్య, గ్రంథాలయోద్యమకారుడు, పత్రికా సంపాదకుడు. (జ.1890) గ్రంథాలయ సర్వస్వము అనే పత్రికను నిర్వహించాడు. ఈయన గ్రంథాలయ ఉద్యమంలో జీవితాంతం విశేష కృషి సల్పి గ్రంథాలయ పితామహుడుగా పేరుగాంచాడు.