బాలీవుడ్ లో కొంత కాలంగా ఖాన్ త్రయం హవానే కొనసాగుతుంది. ఇతర హీరోలు వచ్చినా..ఈ ముగ్గురు హీరోల సినిమాలకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు ప్రేక్షకులు. అంతేకాదు వీరు నటించిన సినిమాలకు మినిమం రూ.200 కోట్లు దాటి కలెక్షన్లు వసూళ్లు చేయడం విశేషం. ఆ మద్య అమీర్ ఖాన్ నటించిన ‘దంగల్’సినిమా ప్రపంచ వ్యాప్తంగా రూ.2000 కోట్లు వసూళ్లు చేసి రికార్డు క్రియేట్ చేసింది. ఇక బాలీవుడ్ లో అమిర్ ఖాన్ - సల్మాన్ ఖాన్ వారి సినిమాలతో వరుసగా బాక్స్ ఆఫీస్ హిట్స్ సాధిస్తున్నారు. కాకపోతే ఆ మద్య షారూక్ నటించిన సినిమాలు ఒకటీ రెండు ఫ్లాప్ టాక్ తెచ్చుకున్నారు.
దాంతో ఈసారి తన సినిమా బాక్సాఫీస్ షేక్ చేయలనే ఉద్దేశంతో ఓ ప్రయోగాత్మక పాత్రలో(మరుగుజ్జు) నటిస్తున్నాడు. ఈ సినిమా కోసం షారూఖ్ ఎంతో కష్టపడ్డారట. మరగుజ్జు పాత్రలో ‘జీరో’ సినిమాలో షారుక్ నటిస్తున్న సంగతి తెలిసిందే. డిసెంబర్ లో ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమా ట్రైలర్ షారూఖ్ పుట్టిన రోజున రిలీజ్ అయ్యింది. సోషల్ మీడియాలో రికార్డుల మోత మోగించింది.
పొట్టిగా కనిపిస్తున్న షారుక్ సరసన కత్రినా కైఫ్, అనుష్క శర్మ లు నటిస్తున్నారు. తాజాగా ఈ సినిమాలో ఎవర్ గ్రీన్ బ్యూటీ శ్రీదేవి కనిపించబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. శ్రీదేవి ఒక పాటలో షారుక్ తో కలిసి స్టెప్పులేయనుందని సమాచారం. ఈ విషయం గురించి జీరో చిత్ర యూనిట్ సభ్యులు ఎవరు స్పందించడం లేదు.
అయితే ఈ విషయాన్ని ఇప్పటి వరకు గోప్యంగా ఉంచడం పై అందరూ ఆశ్చర్యపోతున్నారు. శ్రీదేవి మరణం కంటే ముందే ఈ తరహా ప్లాన్ ను సెట్ చేసుకున్నట్లు సమాచారం. రెడ్ చిల్లీస్ ఎంటర్టైన్మెంట్ పై గౌరి ఖాన్ ఈ సినిమాను నిర్మిస్తుండగా ఆనంద్ ఎల్ రాయ్ సినిమాను నిర్మిస్తున్నారు. ఇక సినిమాను డిసెంబర్ 21న రిలీజ్ చేయనున్నారు.