మెంటల్ మదిలో సినిమాతో తెలుగు తెరపైకి ఎంట్రీ ఇచ్చింది నివేదా పేతురాజ్. ఆ సినిమా పరవాలేదనిపించుకుంది. మెంటల్ మదిలో సినిమా తరువాత నివేదా చిత్రలహరి, బ్రోచేవారెవరురా సినిమాల్లో నటించింది. ప్రస్తుతం అల్లు అర్జున్ హీరోగా నటిస్తున్న అల వైకుంఠపురములో సినిమాలో కీలక పాత్రలో నివేదా నటిస్తోంది. చెన్నైలో పుట్టిన నివేదా పేతురాజ్ మోడలింగ్ రంగాన్ని ఎంచుకుని సినీనటిగా రంగ ప్రవేశం చేసింది.

 

అలా ఒరునాళ్ కూత్తు చిత్రం ద్వారా కోలీవుడ్ ఇండస్ట్రీలోకి నివేదా పేతురాజ్ ఎంట్రీ ఇచ్చింది. సోషల్ మీడియాలో అభిమానులతో ముచ్చటిస్తున్న సమయంలో నివేదా బాల్యంలో జరిగిన సంఘటనల గురించి అభిమానులతో పంచుకుంది. కనిపించింది కొన్ని సినిమాల్లోనే అయినా నటనతో తనదైన ముద్ర వేసుకున్న నివేదా పేతురాజ్ చిన్నతనంలో దొంగతనానికి పాల్పడినట్లు చెప్పింది. తన బాల్యంలో జరిగిన సంఘటనలను అభిమానులతో నివేదా పంచుకుంది. 
 
సోషల్ మీడియాలో నివేదాతో ఒక అభిమాని తన చిన్నతనంలో స్కూల్ లో చాక్ పీస్ లు దొంగతనం చేశానని చెప్పాడు. బదులుగా నివేదా తనకు కూడా అలాంటి అలవాటు ఉండేదని చెప్పింది. చిన్నప్పుడు స్కూల్ లో చాక్ పీస్ లను దొంగలించి ముగ్గులు వేయడం కొరకు అమ్మకు ఇచ్చేదానినని నివేదా చెప్పింది. మరో అభిమాని నివేదాతో బాల్యంలో కరెంట్ పోతే ఆటలాడుకోవటం, కథలు చెప్పుకోవడం చేసేవాడినని చెప్పాడు. 
 
నివేదా పేతురాజ్ అభిమానికి తాను కూడా అలాంటి ఆటలు ఆడేదానినని చెప్పింది. టార్చిలైట్ ను కరెంట్ పోయిన సమయంలో ఇతర పిల్లల ముఖాలపై వేసి భయపెట్టేదాన్ని అని నివేదా పేతురాజ్ చెప్పింది. బాల్యంలోని మధుర జ్ఞాపకాలను అభిమానులతో పంచుకున్న నివేదా పేతురాజ్ పై అభిమానులు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. నివేదా పేతురాజ్ నటించిన అల వైకుంఠపురములో సినిమా సంక్రాంతి పండుగ కానుకగా జనవరి 12వ తేదీన విడుదల కాబోతుంది. 
 
 

మరింత సమాచారం తెలుసుకోండి: