దిశ హత్యాచారా ఘటన గురించి దేశ వ్యాప్తంగా అందరికి తెలిసిందే. కేవలం 10 రోజుల్లోనే ఆమె పై అఘాయిత్యం చేసిన నిందితులు ఎన్ కౌంటర్ లో చనిపోవడంతో దిశ కథకు మంచి ముగింపు దొరికింది. దాంతో ఇప్పటికే... యూట్యూబ్ లో దిశ ఘటన గురించి లెక్కలెన్నని షార్ట్ ఫిలిమ్స్ తెరపైకి వచ్చాయి. అయితే, తాజాగా దిశ ఘటనను ఏకంగా వెండి తెరపైనే చూపించాలనే ఆలోచనలో ఉన్నారట సినీ దర్శక నిర్మాతలు. దిశ ఘటనలోని నిందితుల ఎన్ కౌంటర్ అందరికి సంతృప్తిని కలిగించడంతో... దిశ ఎపిసోడ్ ని ఏదైనా ఒక సినిమాలో కొంత పార్ట్ వరకు పెట్టి ప్రేక్షకులను ఆకట్టుకునేలా చేద్దామని దర్శకుల ప్లాన్.


అయితే, అలా ఆలోచించే వారిలో ముందున్నది మాత్రం ఒక తమిళ సినీ దర్శకుడు. ఈయన దిశ నేపథ్యంలో లో ఒక సినిమా తీద్దామనే ఉద్దేశంతో ఆల్రెడీ ఒక కథను కూడా రాసుకున్నాడు. అతను తెరకెక్కించే సినిమాలో సమంత నటించనుందని బలంగా వార్తలు వస్తున్నాయి. వాస్తవానికి, సామ్ తన వివాహ అనంతరం లేడీ ఓరియెంటెడ్ సినిమాలను చేయడానికి ఎక్కువ ఆసక్తిని చూపుతుంది. యూ టర్న్, ఓ బేబీ హిట్ చిత్రాలు చూసాం కదా! ఇప్పుడు కూడా దిశ పాత్రని పోషించడానికి అంగీకరించిందని సినీ వర్గాల నుంచి టాక్.

ఇంతకీ ఆ దర్శకుడు ఎవరంటే.. అశ్విన్ శరవణన్. ఇతని దర్శకంలో వచ్చిన గేమ్ ఓవర్, మాయ చిత్రాలకు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభించింది. దిశ ఎపిసోడ్ ను తెరకెక్కించే అశ్విన్ శరవణన్.. కథ సిద్ధం చేసుకొని షూట్ ప్రారంభించే పనిలో నిమగ్నమయ్యారట. ఈ సినిమాలో సమంత ఒక ఆత్మ పాత్రలో నటిస్తుందని టాక్. ఒక అమ్మాయి హత్యాచారనికి గురై ఆ తర్వాత ఆత్మల మారి.. తనని చంపిన వారిని ఎలా సంహరిస్తుందోననే కథతో అశ్విన్ శరవణన్ రెడీగా ఉన్నట్లు తెలుస్తుంది. ఏదేమైనా సమంత దిశ పాత్రలో నటిస్తే అది ఒక పెద్ద సంచలమే అవుతుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: