టైటానిక్, టెర్మినేటర్, అవతార్, ఏలియన్స్ వంటి అత్యద్భుతమైన సినిమాల సృష్టికర్త జేమ్స్ క్యామరూన్ గురించి దాదాపుగా ప్రపంచవ్యాప్తంగా తెలియని సినీ ప్రేక్షకుడు ఉండడు అనే చెప్పాలి. ఎందుకంటే అప్పట్లో టైటానిక్ సినిమా ఎంత పెద్ద సంచలనమో, ఆ తరువాత టెర్మినేటర్ సిరీస్ లో వచ్చిన సినిమాలు సహా 10 ఏళ్ళ క్రితం ప్రేక్షకుల ముందుకు వచ్చిన అవతార్ సినిమా ఎంతటి అత్యద్భుత విజయాలు అందుకున్నాయో అందరికీ తెలిసిందే. ఇక అప్పటి నుండి అవతార్ కు సీక్వెల్ పై కసరత్తులు చేసిన క్యామరూన్, ఇటీవల ఆ సినిమాకు సంబంధించి పలు సీక్వెల్స్ ని అనౌన్స్ చేయడం జరిగింది. 

 

ఇక అతి త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న అవతార్ 2 సినిమాకు సంబంధించి ఏదైనా అప్ డేట్ వస్తే బాగుండు అని ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న నేపథ్యంలో, నేడు జేమ్స్ క్యామరూన్, ఆ సినిమాని నిర్మిస్తున్న 20 ఎత్ సెంచరీ ఫాక్స్ స్టూడియోస్ వారి అధికారిక సోషల్ మీడియా అకౌంట్స్ ద్వారా అవతార్ 2 తాలూకు కాన్సెప్ట్ ఆర్ ఫోటోలను విడుదల చేయడం జరిగింది. ఇక ఆ ఫోటోలు అలా విడుదలయ్యాయో లేదో, పలువురు నెటిజన్లు వాటిని సోషల్ మీడియా మాధ్యమాల్లో పలు షేర్స్, లైక్స్ తో ఎంతో వైరల్ చేయడం మొదలెట్టారు. ఇక ఆ ఫోటోలను చూస్తుంటే అవతార్ పార్ట్ 1 కి మించే విధంగా ఈ తాజా పార్ట్ రూపుదిద్దుకుంటోందని అందరికీ అర్ధం అవుతుంది. 

 

కొన్ని వేల కోట్ల రూపాయల బడ్జెట్ తో, ప్రపంచవ్యాప్తంగా పేరుగాంచిన అద్భుతమైన టాలెంట్ కలిగిన టెక్నీషియన్లను, దర్శకుడు క్యామరూన్ ఈ సినిమా కోసం ఎంపిక చేసుకున్నారని అంటున్నారు. అలానే నేడు విడుదల చేసిన పండోర గ్రాహం, దాని తాలూకు ఫోటోలను డిజైన్ చేయడానికి ఎంతో నైపుణ్యత కలిగిన ఆర్ట్ డిజైనర్లతో దగ్గరుండి మరీ డిజైన్లు సిద్ధం చేయించినట్లు తెలుస్తోంది. ఇక ఈ ఫోటోలు చూసిన పలువురు నెటిజన్లు, సినిమా ఎప్పుడెప్పుడూ చూద్దామా అని ఎంతో ఆశతో ఎదురుచూస్తున్నారు. కాగా అవతార్ పార్ట్ 2 సినిమా 2021 డిసెంబర్ లో ప్రపంచవ్యాప్తంగా సినీ ప్రేక్షకుల ముందుకు రానుంది....!! 

మరింత సమాచారం తెలుసుకోండి: