తెలుగు ఇండస్ట్రీలో వారసత్వంగా హీరోల కొడుకులు వస్తుంటారు కానీ హీరోయిన్ల కూతుర్లు రారు. సినిమా ఇండస్ట్రీలోకి అమ్మాయిలను తీసుకురావాలంటే చాలా ఆలోచిస్తారు మన తెలుగువారు. ఇండస్ట్రీ మీద ఉన్న ఇష్టంతో కొంత మంది వారి పిల్లలను హీరోయిన్లుగా పరిచయం చేశారు. ఇప్పుడు వారి గురించి ఈ రోజు అమ్మ శీర్షికలో తెలుసుకుందాం. ఇప్పుడు తెలుగు ఇండస్ట్రీని ఓ ఊపు ఊపిన హీరోయిన్ల కూతుళ్ళు ఇప్పుడు హీరోయిన్లుగా తెర మీద కనిపిస్తున్నారు. నటిగా, రాజకీయనాయకురాలిగా మంచి చరిత్రను సృష్టించిన జయలలిత ఎవరో కాదు. వేదవల్లి అని ఆమె కూడా ఓ ఆర్టిస్ట్ కావడంతో తన కూతురు జయలలితను అంత పెద్ద హీరోయిన్గా చూసుకుంది.
హీరోయిన్ లక్ష్మి మొదట్లో హీరోయిన్గా ఎన్నో చిత్రాల్లో నటించి మెప్పించారు. ఆ తరువాత తల్లిగా, అత్తగా ఇలా రక రకాలు ఎన్నో పాత్రల్లో నటించి ఎన్నో అవార్డులను కూడా సాధించారు. తరువాత ఆమె కూతురు ఐశ్వర్యను కూడా హీరోయిన్గా ఇండస్ట్రీకి పరంచయం చెయ్యగా అమె కొన్ని చిత్రాల్లో నటించి ఎక్కువగా క్యారెక్టర్ ఆర్టిస్ట్గా మంచి పేరు సంపాదించారు. అతిలోకసుందరి అంటే ఇటు టాలీవుడ్, బాలీవుడ్ ఎవ్వరికైనా పెద్దగా పేరు చెప్పాల్సిన పని లేదు. శ్రీదేవి ఆమె చైల్డ్ ఆర్టిస్ట్గా తెలుగు ఇండస్ట్రీకి పరిచయం అయి అక్కినేని నాగేశ్వరరావుకి హీరోయిన్గా నటించి ఆతరువాత తరం నాగార్జునకు కూడా హీరోయిన్గా నటించారామె.
అంత గొప్ప నటి అందగత్తె అని చెప్పవచ్చు. ఆమె గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. ఇక ఆమె కూతురు జాన్వి కపూర్ కూడా బాలీవుడ్ లో హీరోయిన్గా రాణిస్తుంది. త్వరలో ఖుషీకపూర్ కూడా ఎంట్రీ ఇవ్వనున్నవారు. కాకపోతే శ్రీదేవి తన కూతుర్లను హీరోయిన్గా చూడలేకపోవడం ఒక్కటే దురదృష్టకరం. నటి జీవిత ఎన్నో చిత్రాల్లో నటించడమేకాక, ఒక నిర్మాతగా, దర్శకురాలిగా కూడా మంచి పేరు తెచ్చుకున్నారు. ఆమె పెద్ద కూతురు శివాని చిత్రం మొదలై ఆగిపోయింది. రెండవ కూతురు శివాత్మిక చిత్రం మాత్రం మంచి దొరసాని విడుదలై పర్వాలేదనిపించుకుంది.
రాధ ఒకప్పుడు చిరంజీవితో పాటుగా పోటీపడుతూ డాన్స్ చేసిన హీరోయిన్ ఎవరైనా ఉన్నారంటే అది రాధ అనే చెప్పాలి. అప్పట్లో హీరోలకి రాధతో కలిసి డాన్స్ చెయ్యాలంటే గుండెల్లో ధడ పుట్టేదంట అంత ఫాస్ట్ డాన్సర్ రాధ. ఆమె తన కూతుర్లు ఇద్దరు, కార్తిక, తులసిని పరిచయం చేసింది కానీ తల్లి స్థాయిలో పేరు తెచ్చుకోలేకపోయారు. లిజీ తెలుగు కంటే మలయాళంలో ఎక్కువ సినిమాలు చేశారు. ఆమెకు మలయాళంలో మంచి పేరు వచ్చింది. ఆమె తన కూతురు కళ్యాణిని హీరోయిన్ గా పరిచయం చేశారు. కళ్యాణి ఇప్పుడిప్పుడే సినిమాల్లో ఎంట్రీ ఇచ్చినా మంచి పేరు సంపాదించుకుంటున్నారు.
'పున్నమినాగుస చిత్రంతో హీరోయిన్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్న మేనక పలు తెలుగు, తమిళ, మలయాళ, నటించి మెప్పించారు. ఆమె కూతురే కీర్తిసురేష్ 'మహానటి'గా క్రేజ్ తెచ్చుకుంది కీర్తి సురేష్. ఒకప్పుడు హీరోయిన్ గా ఎన్నో సినిమాలు చేసిన మంజుల ఆ తరువాత క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మారారు. తన ముగ్గురు కూతుర్లను ఇండస్ట్రీకి పరిచయం చేసింది. ప్రీతి, వనిత, శ్రీదేవి వీరి ముగ్గురు నటించి కాస్త పర్వాలేదనిపించుకున్నారు. సారిక కూతుళ్ళు శృతిహాసన్, అక్షరహాసన్ ఇద్దరినీ ఇండస్ట్రీకి పరిచయం చేసింది. అయితే శృతి మంచి గుర్తింపు తెచ్చుకుంది. అక్షరహాసన్ ఇప్పుడిప్పుడే నటనలో అడుగు పెట్టింది. ఒకప్పుడు హీరోయిన్గా తెలుగు ఇండస్ట్రీని షేక్ చేసిన రోజా తరువాత రాజకీయాల్లో కూడా అడుగు పెట్టింది. అయితే ఆమె కూతురు అన్షుని కూడా తీసుకొచ్చే ప్రయత్నం చేస్తోందని సమాచారం.