లాక్ డౌన్ వలన యావత్ భారతదేశంలో అనేక కార్యకలాపాలు ఎక్కడ అక్కడే ఆగిపోయాయి. ప్రజలకు ఎంతో వినోదాన్ని అందించే టీవీ షోలు రాకపోవడం వాడు షూటింగ్ లు ఆగిపోవడం ప్రజలు ఎంతో వినోదాన్ని మిస్సయ్యారు అని చెప్పవచ్చు. లాక్ డౌన్ సడలింపు లో భాగంగా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ప్రకారం సినిమా షూటింగులకు, సీరియల్ షూటింగ్ లకు, టీవీ షోలకు నిబంధనలతో కూడిన సడలింపులు ఇచ్చిన విషయం అందరికీ తెలిసిందే.
ఇప్పుడు టీవీ యాంకర్స్ మూడు నెలల తర్వాత మొహానికి మేకప్ వేసుకొని ముందుకి వచ్చారు. వారి అనుభవాలను కరోనా సమయంలో ఇన్ని నెలల తర్వాత కెమెరా ముందుకు వచ్చిన తర్వాత వారి అనుభవాలను వారి కామెడీ పంచ్ ట్యాగ్ లైన్ తో సందడి చేశారు. మూడు నెలల తర్వాత రామానాయుడు స్టూడియోలో మొదలైన షూటింగులో భాగంగా ప్రముఖ యాంకర్ సుమ కనకాల తన అభిప్రాయాల్ని సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. సుమ కనకాల నిర్వహిస్తున్న క్యాష్ ప్రోగ్రాం అత్యంత విజయం సాధించిన అని అందరికీ తెలుసు. ఈ ప్రోగ్రాం ని రామానాయుడు స్టూడియోలో నిర్వహిస్తున్నారు.
మరో కొంతమంది యాంకర్స్ రవి, భాను శ్రీ వారు షూటింగ్ లో భాగంగా జరిగిన కొన్ని సన్నివేశాలతో వారి అనుభవాలను సోషల్ మీడియా వేదికగా ఇన్ స్టా గ్రామ్ లో పోస్ట్ చేశారు. కామెడీ షో లు లేకపోవడం ఈ మూడు నెలల కాలంలో ప్రజలు ఎంతగానో మిస్సయ్యారు అని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ప్రముఖ టీవీ ఛానల్ లో వస్తున్న జబర్దస్త్ కామెడీ ప్రోగ్రాం ఎంత విజయం సాధించిందని అందరికీ తెలుసు. చాలామందికి తమ రోజువారి పనులలో బిజీగా ఉన్న తర్వాత కొంతసేపు ఆహ్లాదంగా, ఆనందంగా నవ్వుకోవడానికి ఇది ఒక ఆహ్వాన పత్రిక వలె ఉపయోగపడింది. ఈ నెల తర్వాత షూటింగ్లో ప్రారంభమవడం అందరికీ ఆనందాన్ని కలిగిస్తుంది. నిబంధనలు ఉల్లంఘించకుండా కరోనా బారిన పడకుండా అందరూ ఆనందంగా ఉండాలని సినీ ప్రముఖులు వారి సోషల్ మీడియా ఖాతాల ద్వారా తెలిపారు.