ఒక్క సారిగా ఈ హీరోయిన్ బాగా  పాపులరై అనుకోకుండా అమాంతం కెరీర్ పరంగా జీరో అయిపోయింది. శ్వేతా బసు ప్రసాద్ వ్యభిచార రాకెట్టులో ఆరోపణలు వల్ల ఈమె రెండు నెలలు పాటు  రెస్క్యూ హోమ్ లో గడిపింది. సంక్షోభ సమయంలో ఓ ప్రకటన చేసిన జర్నలిస్ట్ గురించి తప్ప మరెవరి పైనా నా వైపు నుంచి ఫిర్యాదులు లేవు అని ఆమె చెప్పింది. ఇలా ఆ ప్రకటన ప్రతి చోటా ప్రచారం చేసేశారు కానీ ఆ తర్వాత నాకు  ఇలా ప్రచారం చేసారని కూడా తెలియదని  ఇంటర్వ్యూలో శ్వేతా బసు వెల్లడించింది.

అలానే  ప్రతి పేపర్, వెబ్ సైట్, టెలివిజన్ ఛానల్ లో ఉన్నట్టు నేను తప్పు  చెయ్యలేదు అని ఆమె చెప్పింది. మీడియా తో కూడా నేను మాట్లాడలేని పరిస్థితి అని ఆమె అంది. నాపై ఆరోపించిన వారు అన్ని తలుపులు మూసివేశారని నాకు అర్థమైంది అని  ఆమె చెప్పడం జరిగింది. కానీ  చిత్ర పరిశ్రమ ఎప్పుడూ నాకు చాలా వామ్ వెల్ కం పలుకుతోంది అని తెలిపింది. డబ్బు  కోసం వ్యభిచారం చేయటానికి ఎవరో నన్ను ప్రోత్సహించారనడం నేను ఎప్పుడూ చెప్పని దారుణమైన అబద్ధం అంటూ ఆవేదన చెందింది శ్వేతా.

నేను హిందూస్థానీ శాస్త్రీయ సంగీతంపై డాక్యుమెంటరీ చేయడానికి నా జీవితంలో మూడున్నర సంవత్సరాలు గడిపాను అని అన్నారు. డాక్యుమెంటరీపై దృష్టి పెట్టాలని అనుకున్నాను. ఇప్పుడు అది పోస్ట్ ప్రొడక్షన్ లో ఉన్నందున నేను నా నటన పై దృష్టి పెట్టాలనుకుంటున్నాను అని చెప్పారు. ఇది ఇలా ఉండగా  ఈ హీరోయిన్ ఇప్పుడు ఒక వెబ్ సిరీస్ లలో నటించేందుకు సిద్ధమైన సంగతి తెలిసిందే. ఆమె తాజాగా ఏడారిలో ఒంటె తో ప్రయాణానికి సంబంధించిన ఫోటోల్ని శ్వేతా షేర్ చేయగా అవి కూడా కాస్తా వైరల్ గా మారడం జరిగింది.

మరింత సమాచారం తెలుసుకోండి: