ప్రస్తుతం జీ తెలుగు లో ప్రసారమయ్యే బొమ్మ అదిరింది షో కి ఎంత క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రతి ఆదివారం బుల్లితెర ప్రేక్షకులను కడుపుబ్బ నవ్విస్తూ రోజురోజుకు ప్రేక్షకుల ఆదరణ పొందుతూ దూసుకుపోతుంది బొమ్మ అదిరింది షో. ఈటీవీ లో ప్రసారమయ్యే జబర్దస్త్ షో కి పోటీగా మొదలైన ఈ షో మొదట కాస్త రేటింగ్ తక్కువగా సొంతం చేసుకున్నప్పటికీ ఆ తర్వాత మాత్రం క్రమక్రమంగా బుల్లితెర ప్రేక్షకులందరికీ ఆకర్షిస్తూ దూసుకుపోతుంది. ముఖ్యంగా ఎంతో నాచురల్ కామెడీ తో బుల్లితెర ప్రేక్షకులను అలరిస్తుంది బొమ్మ అదిరింది షో.



 బొమ్మ అదిరింది షోలో భాగంగా మొన్నటివరకు యాంకర్ రవి భాను శ్రీ లు యాంకరింగ్ చేయగా ఇక ఇటీవలే శ్రీముఖి యాంకర్ గా ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. ప్రస్తుతం శ్రీముఖి తనదైన వాక్చాతుర్యంతో బొమ్మ అదిరింది షోలో ఎంతో మంది ప్రేక్షకులను ఆకట్టుకుంది. అయితే ప్రస్తుతం బుల్లితెర ప్రేక్షకులు అందరిని ఆకర్షించేందుకు బొమ్మ  అదిరింది నిర్వాహకులు ఎప్పటికప్పుడు సరికొత్త ప్రయత్నాలు చేస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ప్రతి వారం ఒక సరికొత్త గెస్ట్ ని పిలుస్తున్నారు.



 గత వారం శివ శంకర్ మాస్టర్ ని గెస్ట్ గా పిలిచారు బొమ్మ అదిరింది షో నిర్వాహకులు. ఇక ఈ వారం ఇటీవలె బొమ్మ అదిరింది కి సంబంధించిన ప్రోమో విడుదలై  సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇక ఈ వారం... బొమ్మ అదిరింది షో కి krishna MURALI' target='_blank' title='పోసాని కృష్ణమురళి-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>పోసాని కృష్ణమురళి గెస్ట్ గా వచ్చారు. తనదైన శైలిలో అలరించారు పోసాని కృష్ణ మురళి. ఇక ప్రోమోలో ఓ సందర్భంలో సమంత తమన్నా కాజల్ ముగ్గురు కలిసి అని పోసాని మాట్లాడుతున్న ఈ సందర్భంలో ఇప్పుడు నా గురించి ఎందుకు సార్ అంటూ శ్రీముఖి అంటుంది... దీంతో వెంటనే స్పందించిన పోసాని  కృష్ణమురళి శ్రీముఖి అంటూ ఏదో అనబోతుంటే గా మీ కాళ్లు పట్టుకుంటాను సార్ ఏమీ అనకండి అంటూ శ్రీముఖి రిక్వెస్ట్ చేస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: