ఆయనకు కన్నీళ్లు వచ్చేయడంతో ఎవరైనా చూస్తే..నవ్వుతారని కర్చీఫ్ కోసం వెతుకుతున్నాడట. పక్క సీటులో ఉన్న మంజు భార్గవి కళ్ళు తుడుచుకోమని ఆమె చీర కొంగును చిరుకు ఇచ్చారట. ఆమె చీర కొంగుతో చిరంజీవి కళ్ళు తుడుచుకుంటూ ఉండగా... సడన్ గా లైట్స్ వెలిగాయట. మంజు భార్గవి చీర కొంగు తన చేతిలో ఉండడం చూసిన వారందరు తప్పుగా అనుకున్నారేమో అని చిరంజీవి బాధపడ్డారట.ఆ షోకి తండ్రి అల్లు రామలింగయ్యతో పాటు హాజరైన సురేఖ తర్వాత తనను పెళ్లి చేసుకోవడానికి ఇష్టపడదేమో అని చిరంజీవి అనుకున్నారట. కానీ సురేఖ చిరంజీవితో పెళ్ళికి అంగీకరించింది అని చిరంజీవి ఆ రోజు జరిగిన ఫన్నీ సిట్యుయేషన్ ని సమంతతో పాటు తెలుగు ప్రేక్షకులకు తెలియజేశారు.
కళా తపస్వి కె విశ్వనాథ్ తెరకెక్కించిన శంకరాభరణం అప్పట్లో అనేక అంతర్జాతీయ అవార్డులు గెలుపొందింది. అలా అప్పట్లో జరిగిన ఈ ఫన్నీ మూమెంట్ గురించి మెగాస్టార్ ,సమంత టాక్ షో లో ప్రేక్షకులతో సరదాగా పంచుకున్నాడు...ఇక చిరంజీవి ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో ఆచార్య సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే.. ఈ మధ్యే మొదలైన ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది.. ఇటీవలే కాజల్ అగర్వాల్, చిరూ లపై కీలక సన్నివేశాలను చిత్రీకరించారు మూవీ యూనిట్..వచ్చే ఏడాది విడుదల కానున్న ఈ సినిమాలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఓ కీలక పాత్ర పోషిస్తున్నాడు...!!