ఇండియా హెరాల్డ్ అందిస్తున్న ఈ ఆర్టికల్ చదవండి...టాలీవుడ్ లో టాప్ హీరోయిన్స్ లా దూసుకుపోతున్నారు పూజ హెగ్దే, రష్మిక మందన.ఇక ఈ హాట్ బీట్స్ ఇద్దరు బాలీవుడ్ మీద ఫోకస్ పెట్టారట... బాలీవుడ్ లోను తమ హవా ని చాటబోతున్నారట.ఈ ఇద్దరు బ్యూటీలు బాలీవుడ్లో రాణించాలని తెగ ప్రయత్నాలు మొదలుపెట్టారట. వీరికి ఆఫర్లు కూడా అదే స్థాయిలో వస్తున్నాయని వినికిడి. ప్రస్తుతం ‘రాధే శ్యామ్’ ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’ వంటి బడా చిత్రాల్లో నటిస్తున్న పూజా హెగ్డే.. ఆ తరువాత బాలీవుడ్లోనే ఎక్కువ సినిమాలు చెయ్యబోతుందట.

‘యశ్ రాజ్ ఫిలిమ్స్’ వారు నిర్మించబోయే చిత్రంతో పాటు‘సాజిద్ నాడియాద్ వాలా అండ్ సన్స్’ వారు నిర్మించే సినిమాలోనూ అలాగే రణవీర్ సింగ్డైరెక్టర్ రోహిత్ శెట్టి కాంబినేషన్ లో తెరకెక్కుతున్న ‘సర్కస్’ అనే సినిమాలో పూజా హీరోయిన్ గా ఎంపికయ్యింది. ఇక రష్మిక కూడా సిద్ధార్థ్ మల్హోత్రా సరసన ‘మిషన్ మజ్ను’ అనే సినిమాలో హీరోయిన్ గా నటిస్తుంది. అంతేకాదు మరో రెండు క్రేజీ ప్రాజెక్టులలో కూడా రష్మిక ఛాన్స్ దక్కించుకున్నట్టు సమాచారం.

ఈ ఇద్దరు ముద్దుగుమ్మలు కూడా 2020లో తెలుగులో "అల వైకుంఠపురంలో", సరిలేరు నీకెవ్వరూ" సినిమాలతో మంచి హిట్స్ అందుకున్నారు. ఇప్పుడు నువ్వా నేనా అని తెగ పోటీ పడుతున్నారు. ఇక ఇలాంటి మరెన్నో మూవీ అప్ డేట్స్ కోసం ఇండియా హెరాల్డ్ గ్రూప్ ని ఫాలో అవ్వండి. ఇంకా మరెన్నో విషయాలు తెలుసుకోండి...

మరింత సమాచారం తెలుసుకోండి: