‘యశ్ రాజ్ ఫిలిమ్స్’ వారు నిర్మించబోయే చిత్రంతో పాటు‘సాజిద్ నాడియాద్ వాలా అండ్ సన్స్’ వారు నిర్మించే సినిమాలోనూ అలాగే రణవీర్ సింగ్ – డైరెక్టర్ రోహిత్ శెట్టి కాంబినేషన్ లో తెరకెక్కుతున్న ‘సర్కస్’ అనే సినిమాలో పూజా హీరోయిన్ గా ఎంపికయ్యింది. ఇక రష్మిక కూడా సిద్ధార్థ్ మల్హోత్రా సరసన ‘మిషన్ మజ్ను’ అనే సినిమాలో హీరోయిన్ గా నటిస్తుంది. అంతేకాదు మరో రెండు క్రేజీ ప్రాజెక్టులలో కూడా రష్మిక ఛాన్స్ దక్కించుకున్నట్టు సమాచారం.
ఈ ఇద్దరు ముద్దుగుమ్మలు కూడా 2020లో తెలుగులో "అల వైకుంఠపురంలో", సరిలేరు నీకెవ్వరూ" సినిమాలతో మంచి హిట్స్ అందుకున్నారు. ఇప్పుడు నువ్వా నేనా అని తెగ పోటీ పడుతున్నారు. ఇక ఇలాంటి మరెన్నో మూవీ అప్ డేట్స్ కోసం ఇండియా హెరాల్డ్ గ్రూప్ ని ఫాలో అవ్వండి. ఇంకా మరెన్నో విషయాలు తెలుసుకోండి...