ఇంటర్నెట్ డెస్క్: ఉయ్యాల జంపాలా, కుమారి 21 ఎఫ్ వంటి సినిమాలతో టాలీవుడ్ ప్రేక్షకులకు దగ్గరైన యువ హీరో రాజ్ తరుణ్. ఈ మధ్యనే ఒరేయ్ బుజ్జిగా చిత్రంతో తెలుగు ప్రేక్షకులను పలకరించాడు. అయితే ఇప్పుడు మరో చిత్రంతో మన ముందుకు రాబోతున్నాడు. ఈ చిత్రానికి పవర్ ప్లే అనే టైటిల్ ను ఖరారు చేశారు. ఈ చిత్రాన్ని కూడా ఒరేయ్ బుజ్జిగా దర్శకుడు కొండా విజ‌య్ కుమార్‌తోనే చేస్తున్నాడు. శ్రీ‌మ‌తి ప‌ద్మ స‌మ‌ర్ప‌ణ‌లో వ‌న‌మాలి క్రియేష‌న్స్ ప్రై.లి ప‌తాకంపై ప్రొడ‌క్ష‌న్ నెం.1గా రూపొందుతోన్నఈ చిత్రాన్ని మ‌హీధర్‌, దేవేష్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

ఇప్ప‌టికే ఈ సినిమాకు సంబంధించిన ఫ‌స్ట్‌లుక్‌ మోష‌న్ పోస్ట‌ర్‌, టీజ‌ర్‌, ట్రైల‌ర్‌లు విడుదల చేశారు. వీటికి మంచి స్పందన వచ్చింది. ఈ నేపథ్యంలో ఈ చిత్రాన్ని స‌మ్మ‌ర్ స్పెష‌ల్‌గా మార్చి 5న గ్రాండ్‌గా విడుద‌ల‌ చేయనున్నామని చిత్ర బృందం వెల్లడించింది. అయితే వాలైంటైన్స్ డే సంద‌ర్భంగా రిలీజ్‌ డేట్‌తో ఓ స్పెషల్ పోస్ట‌ర్‌ని చిత్ర యూనిట్‌ విడుద‌ల చేసింది.

హీరో రాజ్ త‌రుణ్ మాట్లాడుతూ .. విజ‌య్‌తో క‌లిసి స‌రికొత్త జోన‌ర్‌లో చేస్తోన్న డిఫ‌రెంట్ థ్రిల్ల‌ర్ స‌బ్జెక్ట్ 'పవర్ ప్లే' అని చెప్పాడు. ఇది క‌మ‌ర్షియ‌ల్‌గా మంచి హిట్ అవుతుంద‌నే న‌మ్మ‌కం ఉందని అన్నాడు.

ద‌ర్శ‌కుడు విజ‌య్ కుమార్ కొండా మాట్లాడుతూ.. 'ఇటీవ‌ల విడుద‌లైన ట్రైల‌ర్‌కి మంచి రెస్పాన్స్ వ‌స్తోంది. సినిమా ఆవుట్‌పుట్ చాలా బాగా వ‌చ్చింది. డెఫినెట్‌గా అంద‌ర్నీ థ్రిల్ చేస్తుంది" అని రాజ్ తరుణ్ చెప్పుకొచ్చాడు. ఇక నిర్మాత దేవేష్ కూడా సినిమాపై పూర్తి నమ్మకం ఉందన్నారు.

ఇదిలా ఉంటే ఆదివారం వాలైంటైన్స్ డే సంద‌ర్భంగా ప‌వ‌ర్‌ప్లే టీమ్ త‌రుపున ఒక కాంటెస్ట్ నిర్వ‌హించారు. యువ జంటలు తమ వాలైంటైన్‌తో క‌లిసి ల‌వ్ ప్ర‌పోజ్ చేస్తూ ఒక షార్ట్ వీడియో తీసి దానికి @వనమాలి_క్రియేషన్స్‌ ని ట్యాగ్ చేసి తమ సోష‌ల్ మీడియా అకౌంట్స్‌లో పోస్ట్ చేయాలని కోరింది. ఈ నెల 16వ తేదీ వ‌ర‌కూ వీడియోస్ పంపే అవకాశం కల్పించింది. ఫిబ్ర‌వ‌రి 18న ఈ కాంటెస్ట్‌లో గెలిచిన జంటలకు బంపర్ ప్రైజ్ గా దుబాయ్ ట్రిప్ అందించనున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: