సినిమా  ఇండస్ట్రీకి వచ్చి తమకంటూ మంచి గుర్తింపు సాధించుకోవడం కోసం అనుక్షణం పరితపించిన హీరోయిన్స్ లో ఒకప్పటి అగ్ర నటి  గౌతమి  ఒకరు.. తెలుగులో ఏ రాజేంద్రప్రసాద్ హీరోగా వచ్చిన గాంధీ నగర్ రెండో వీధిలో సినిమాలో హీరోయిన్ గా నటించిన గౌతమి.

ఆ సినిమాతో నటిగా మొదటి  గుర్తింపును సాధించింది.. తర్వాత నాగార్జున సరసన కూడా ఒక సినిమాలో నటించింది..ఇక ఆ తర్వాత తెలుగులో చాలా సినిమాల్లో అవకాశాలు వచ్చిన సమయంలో కూడా తమిళంలో రజనీకాంత్, ప్రభు లాంటి హీరోలతో కలిసి గురుశిష్యులు అనే సినిమాలో నటించింది.ఇక తెలుగు లో కోడి రామకృష్ణ డైరెక్షన్ లో వెంకటేష్ హీరోగా వచ్చిన శ్రీనివాస కళ్యాణం సినిమాతో తెలుగులో హీరోయిన్ గా స్థిర పడింది..ఇక తమిళంలో రజనీకాంత్, కమలహాసన్ సినిమాల్లో ఎక్కువగా నటించి అక్కడ మంచి గుర్తింపు సాధించారు.అలాగే అప్పట్లో హీరోయిన్ గా వెలుగొందుతున్న భానుప్రియ, కుష్బూ లాంటివారికి అప్పట్లో గట్టి పోటీని ఇస్తూ వచ్చింది.

కమల్ హాసన్ తో విచిత్ర సోదరులు, క్షత్రియపుత్రుడు, ద్రోహి లాంటి సినిమాల్లో నటించి మంచి గుర్తింపును సాధించింది.రజినికాంత్ తో రాజా చిన్న రోజా అనే సినిమాలో నటించి మంచి గుర్తింపును సాధించింది.ఇక ఈ మధ్య ఓ ఇంటర్వ్యూలో గౌతమి మాట్లాడుతూ..ఒకప్పుడు షూటింగ్ లకు ఈమెతో పాటు వాళ్ళ అమ్మగారు కూడా వచ్చేవారనీ అప్పుడు పెద్దగా బయటి ప్రపంచం గురించి ఆవిడకి అవగాహన లేదని చెప్పారు.అలాగేవాళ్ళ అమ్మ చనిపోయిన తర్వాత ప్రపంచ అంటే ఎలా ఉంటుందో తనకి ఇప్పుడు ఇప్పుడు తెలుస్తుంది అని చెప్పుకొచ్చారు.ముఖ్యంగా సినిమా ఇండస్ట్రీలో ఉండేవారు తమ మోసపూరితమైన మాటలతో నమ్మించి మోసం చేస్తారు అని చెప్పుకొచ్చింది.ఒకప్పుడు కమల్ హాసన్ లాంటి నటుడు తనతో చనువుగా నడుచుకునేవాడని అప్పటికే ఆయన రెండు పెళ్లిళ్లు చేసుకొని వారిద్దరికీ విడాకులు ఇచ్చారని తెలిసిన కూడా తన మాటలకి నమ్మి మోసపోయాను అని చెప్పారు.ప్రస్తుతం కమలహాసన్ నుంచి విడిపోయి ఒంటరిగా బతుకుతున్నాను అని చెప్తూ అసలు ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో కూడా తెలియడం లేదు అని తనలోని బాధను బయటపెట్టింది గౌతమి..ఒకప్పుడు అగ్ర నటిగా కొనసాగిన ఈమె.. ఇప్పుడు అన్ని కోల్పోయి ఇలా ఒంటరవ్వడం బాధాకరమైన విషయం..!!

మరింత సమాచారం తెలుసుకోండి: