ఒకప్పుడు మంచి అభిరుచి ఉన్న సినిమాల ను చేస్తూ ముందుకు దూసుకెళ్తున్న హీరో ఎవరైనా ఉన్నారు అంటే కచ్చితంగా అది శర్వానంద్ అనే చెప్పాలి . కెరీర్ మొదట్లో వెన్నెల , ప్రస్థానం లాంటి వైవిధ్యమైన కథల తో మంచి గుర్తింపు తెచ్చుకున్న శర్వానంద్ ఆ తర్వాత రన్ రాజా రన్, మళ్లీ మళ్లీ ఇది రాని రోజు, శతమానం భవతి లాంటి సినిమాల తో సక్సెస్ అందుకున్నాడు .

కానీ ప్రస్తుతం ఆయన చేసిన పడి పడి లేచే మనసు, రణరంగం, జాను లాంటి సినిమాలు ఫ్లాప్ అవడంతో కొంచెం డల్ అయ్యాడని చెప్పాలి. అయితే ఎన్నో అంచనాల తో రిలీజైన శ్రీకారం సినిమా కూడా హిట్ టాక్ సంపాదించుకుంది అయినప్పటి కీ కలెక్షన్స్ మాత్రం రాబట్టలేకపోయింది దీనికి ఒక కారణం ఈ సినిమా తో పాటు రిలీజ్ అయిన జాతిరత్నాలు సినిమా మంచి టాక్ సంపాదించి బాక్సాఫీస్ ని షేక్ చేస్తూ ముందుకు దూసుకెళ్తు ఉండడం అనేది దీని కి మైనస్ గా మారింది .

అయితే శ్రీకారం మూవీ పై ఎన్నో అంచనాలు పెట్టుకున్న శర్వానంద్ తీవ్ర నిరాశ కు గురి అవుతున్నారని తెలుస్తోంది . ఈ సినిమాతో అయిన ఒక డీసెంట్ హిట్ అందుకుంటాను అనే ఆశలు పెట్టుకున్న శర్వానంద్ ఆశ నిరాశ అయిందనే చెప్పాలి. అయితే ప్రస్తుతం అజయ్ భూపతి డైరెక్షన్లో మహాసముద్రం అనే సినిమా చేస్తున్నారు. అలాగే ఒక తమిళ్ తెలుగు సినిమా కూడా చేస్తున్నారు. కిషోర్ తిరుమల దర్శకత్వంలో ఆడవాళ్లు మీకు జోహార్లు అనే సినిమా కూడా చేస్తున్నాడు ప్రస్తుతానికి ఈ సినిమాపైనే ఎక్కువ అంచనాలు పెట్టుకున్నాడు శర్వానంద్ . మరి వచ్చే ఈ సినిమాలతో అయిన శర్వానంద్ హిట్ ట్రాక్ ఎక్కుతాడా, లేదా అనేది వేచి చూడాల్సిందే......

మరింత సమాచారం తెలుసుకోండి: