సూపర్ స్టార్ మహేశ్‌బాబు హీరోగా పరుశురామ్‌ దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్‌ సంస్థ నిర్మిస్తున్న చిత్రం ‘సర్కారు వారి పాట’. ఇందులో మహేశ్‌ సరసన కీర్తి సురేష్ నటిస్తోంది. కరోనా సెకండ్‌ వేవ్‌ కారణంగా ఈ సినిమా షూటింగ్‌ తాత్కాలికంగా ఆగిపోయింది. ఇదిలా ఉంటే ఈ సినిమాకు సంబంధించి ఓ ఇంట్రెస్టింగ్‌ న్యూస్‌ సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతోంది. 


ఈ సినిమాలో ప్రముఖ కోలీవుడ్ నటుడు, యాక్షన్‌ కింగ్‌ అర్జున్ విలన్‌గా నటించబోతున్నారని ఆ వార్త సారాంశం.దర్శకుడు పరశురామ్ ఇప్పటికే అర్జున్ కు కథ వినిపించారని, ఈ సినిమాలో నటించేందుకు ఆయన అంగీకరించారని వార్తలు వస్తున్నాయి. జూలైలో ‘సర్కారు వారి పాట’ కొత్త షెడ్యూల్‌ ప్రారంభించాలని అనుకుంటున్నారు. సినిమా కోసం హైదరాబాద్‌లో ప్రత్యేకంగా నిర్మించిన ఓ భారీ సెట్లో మహేశ్‌ బాబు-అర్జున్‌పై కీలక సన్నివేశాలను తెరకెక్కిస్తారట.  అయితే దీనిపై ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు.అయితే ఈ వార్త మహేష్ అభిమానులలో కలవర పెడుతుంది.


 ఎందుకంటే ఈ మధ్యలో హీరో అర్జున్ డైరెక్ట్ గా నటించిన ఏ తెలుగు సినిమా హిట్ అవ్వలేదు. ఆయన విలన్ గా చేసిన లై , ముఖ్యమైన పాత్ర చేసిన రామ రామ కృష్ణ కృష్ణ , శ్రీ అంజనేయం , నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా సినిమాలు అట్టర్ ప్లాప్ అయ్యాయి. దానితో ఈ ఎఫెక్ట్ సర్కారు వారి పాట మీద కూడా పడుతుంది అని అభిమానులు భయపడుతున్నారు. ఇక ఈ సినిమాలో మహేశ్‌ మాస్‌ లుక్‌లో ఆకట్టుకోబోతున్నారు. ఇప్పటికే రిలీజ్ చేసిన ఫస్ట్ లుక్ తో ..చెవి పోగుతో మెడపై రూపాయి టాటూతో సరికొత్తగా కనిపించారు. ‘హ్యాట్రిక్‌ కోసం బ్లాక్‌బస్టర్‌ ఆరంభం’ అని పేర్కొన్నారు.ఇక ఈ సినిమాలో మ‌హేశ్‌బాబు తో పాటు వెన్నెల కిషోర్, సుబ్బరాజు కీలక పాత్రలో కనిపించన్నారు. సరిలేరు నికేవ్వరు హిట్ తర్వాత మహేష్ తీస్తున్న సినిమా అవ్వడంతో అంచనాలు భారీగా ఉన్నాయి.


మరింత సమాచారం తెలుసుకోండి: