టాలీవుడ్ లో చాలామంది వివాహ బంధాలు కడదాకా కొనసాగలేదు. ఎంతోమంది సెలబ్రిటీల పెళ్లిళ్లు మధ్యలోనే విడాకుల పాలు అయ్యాయి.  ఆ విధంగా కథానాయిక సరిత విడాకుల వివాదం అప్పట్లో పెద్ద సెన్సేషనల్ సృష్టించింది. బాలచందర్ తెరకెక్కించిన మరో చరిత్ర సినిమా ద్వారా సినీ ఎంట్రీ ఇచ్చి ఆ తర్వాత తెలుగు తమిళ కన్నడ మలయాళ భాషలలో 150 సినిమాల వరకు చేసి ప్రేక్షకుల్లో మంచి పాపులారిటీ అందుకుంది. సినిమా జీవితం ఎంతో హాయిగా సాగిన కూడా ఆమె వివాహ జీవితం మాత్రం చాలా ఇబ్బందులు ఎదుర్కొంది.

ఆమె తన జీవితంలో రెండు సార్లు పెళ్లి చేసుకుంది మొదటిసారి 1975వ సంవత్సరం రంగస్థల నటుడు చలం ను పెళ్లి చేసుకోగా కొన్ని కారణాల వల్ల  వీరిద్ధరికీ సంవత్సరంలోనే విడాకులు తీసుకున్నారు. వీరి విడాకుల పంచాయతీ ఎంతలా జరిగిందంటే తమిళనాడు విడాకుల చట్టాలలో సరిత అనే ఒక చట్టం కూడా వచ్చింది.  ఆ తర్వాత మళ్ళీ 1988లో మలయాళం నటుడు ముఖేష్ ను పెళ్లి చేసుకుంది. వారిద్దరికీ ఇద్దరు కొడుకులు కూడా పుట్టారు. అయితే వీరికి అభిప్రాయ భేదాలు తలెత్తడం తో ఆ తర్వాత విడాకులు కోర్టులో పిటిషన్ వేశారు. 

2007లో వీరిరువురికీ కోర్టు విడాకులు మంజూరు చేయగా ఆయన ఓ క్లాసికల్ డాన్సర్ ను పెళ్లి చేసుకోవడంతో సరిత మళ్లీ కోర్టుకెక్కింది. కోర్టులో వీరి వివాహం చెల్లదని కుటుంబ సంక్షేమ కోర్టులో ఫిర్యాదు చేయగా ఈ విచారణ సందర్భంగా కోర్టుకు హాజరైన సరిత అక్కడే కళ్లు తిరిగి పడిపోయింది. ఏదేమైనా సరిత తన రెండు వివాహ బంధాలలో నిలబడలేక తట్టుకోలేక పోయింది. ప్రస్తుతం ఒంటరిగా తన జీవితాన్ని కొనసాగిస్తుంది. ఇద్దరు కొడుకుల తో పాటు సినిమా ఇండస్ట్రీకి దూరంగా ఉంది. ఆమెను మళ్ళీ తెరపై చూడాలని అభిమానుల కోరిక నెరవేరలేదు. భవిష్యత్తులో ఆమె తెరపై కనిపించే ఛాన్స్ ఇస్తుందో లేదో చూడాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: