అయితే అల్లు శిరీష్ మనకు సినిమాలో మాత్రమే నటిస్తాడని తెలుసు. కానీ గీతా సంస్థ కో ప్రొడ్యూసర్గా, సౌత్ స్కోప్ మాస పత్రిక ఎడిటర్గా కూడా ఈయన పని చేస్తున్నాడు. కె.రాధామోహన్ దర్శకత్వంలో మొదటి సినిమా `గౌరవం`తో సినిమాతో తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చాడు అల్లు శిరీష్. ఆ తరువాత 2014లో గీతా ఆర్ట్స్ బ్యానర్పై బన్నీ వాసు నిర్మాతకగా మారుతి దర్శకత్వంలో వచ్చిన కొత్త జంటలో నటనకు మంచి పేరు తెచ్చుకున్నాడు. ఈ సినిమాలో శిరీష్ జోడీగా రెజీనా నటించింది.
అయితే గతంలో అల్లు శిరీష్, హీరోయిన్ అనూ ఇమ్మానుయేల్తో ప్రేమాయణం నడుపుతున్నట్టు కూడా ప్రచారం సాగింది. వారి ఇద్దరి మధ్య సమ్థింగ్ సమ్థింగ్ అంటూ కథనాలు కూడా గతంలో వెలువడ్డాయి. దానికి కారణం అనూ ఎమ్మాన్యుయేల్ పుట్టిన రోజు సందర్భంగా అల్లు శిరీష్ ఓ విడియోను సోస్ట్ చేయడమే.. అయితే మెగా కాంపౌండ్లో పలు సినిమాలు చేసింది అను. శిరీష్ చిన్న మామ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్తో అజ్ఞతవాసి చిత్రంలో నటించింది. ఆ తరువాత నా పేరు సూర్య లో అల్లు అర్జున్ సరసన నటించింది ఈ ముద్దు గుమ్మ. దీంతో అల్లు శిరీష్, అను ఎమ్మానుయేల్ మధ్య పరిచయం ఏర్పడింది.