టాలీవుడ్ స్టార్ హీరోలు ఎన్టీఆర్, రామ్ చరణ్ తొలిసారిగా కలిసి నటిస్తున్న లేటెస్ట్ భారీ పాన్ ఇండియా సినిమా ఆర్ఆర్ఆర్. రౌద్రం రణం రుధిరం పేరుతో ఎంతో గ్రాండ్ లెవెల్లో దర్శకధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి తీస్తున్న ఈ ప్రతిష్టాత్మక సినిమా షూటింగ్ ప్రస్తుతం ఉక్రెయిన్ లో జరుగుతున్న విషయం తెలిసిందే. ఎన్టీఆర్, చరణ్ లపై ఒక సాంగ్ తో పాటు చరణ్, అలియా భట్ లపై మరొక సాంగ్ ఈ షెడ్యూల్ లో చిత్రికరించనున్నట్లు టాక్. దీనితో షూటింగ్ మొత్తం పూర్తి అవుతుంది.

ఇక ఈ సినిమాకి కీరవాణి సంగీతాన్ని అందిస్తుండగా డివివి దానయ్య దీనిని ఎంతో భారీ వ్యయంతో నిర్మిస్తున్నారు. ఎన్టీఆర్ కొమురం భీం గా కనిపించనున్న ఈ సినిమాలో రామ్ చరణ అల్లూరి సీతారామరాజు పాత్ర చేస్తున్నారు. కేకే సెంథిల్ కుమార్ ఛాయాగ్రాహకుడిగా, సాయి మాధవ్ బుర్రా డైలాగ్ రైటర్ గా పనిచేస్తున్న ఈ సినిమాలో సముద్రఖని, శ్రియ శరణ్, రాహుల్ రామకృష్ణ, అజయ్ దేవగన్ తదితరులు ఇతర పాత్రలు చేస్తున్నారు. ఇక ఇటీవల ఈ సినిమా నుండి విడుదలైన ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్, ఇద్దరు హీరోల టీజర్స్ అలానే కొద్దిరోజుల క్రితం విడుదలైన దోస్తీ సాంగ్ అన్ని కూడా ప్రేక్షకాభిమానులను ఎంతో ఆకట్టుకుని సినిమాపై తారా స్థాయిలో అంచనాలు క్రియేట్ చేసాయి.

అసలు విషయం ఏమిటంటే ఎన్టీఆర్, రామ్ చరణ్ ఇద్దరూ కూడా సరదాగా దోస్త్ సాంగ్ పాడుకుంటూ కార్లో ఎంజాయ్ చేస్తున్న వీడియోని కొద్దిసేపటి క్రితం ఆర్ఆర్ఆర్ యూనిట్ విడుదల చేసింది. అంతే కాదు, మీరు కూడా మీ స్నేహితులతో ఈ సాంగ్ ని హ్యాపీ గా హమ్ చేసుకునే వీడియోలను పోస్ట్ చేయమంటూ ఆర్ఆర్ఆర్ టీమ్ కోరింది. మొత్తంగా ఇటీవల తమ సినిమా ప్రమోషన్స్ ని మంచి కిక్ ఇచ్చే రేంజ్ లో ప్రారంభించిన ఆర్ఆర్ఆర్ యూనిట్, రాబోయే రోజుల్లో ప్రేక్షకాభిమానులను మరిన్ని అప్ డేట్స్ అందిస్తాం అని, అలానే సినిమాని అక్టోబర్ 13న విడుదల చేస్తాం అని అంటోంది ....!!


మరింత సమాచారం తెలుసుకోండి: