టాలీవుడ్ నటుడు యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా గతంలో కొరటాల శివ తీసిన సినిమా జనతా గ్యారేజ్. మలయాళ నటుడు మోహన్ లాల్ ప్రధాన పాత్ర చేసిన ఈ సినిమాలో సమంత కథానాయికగా నటించగా ప్రత్యేక పాత్రలో నిత్యా మీనన్ కనిపించింది. అయితే మంచి అంచనాలతో విడుదలైన ఈ సినిమా పెద్ద సక్సెస్ అందుకుంది. ఇక కొంత విరామం అనంతరం త్వరలో మరొక్కసారి ఎన్టీఆర్ తో కలిసి ఒక భారీ సినిమా తీయనున్నారు కొరటాల శివ.
ఇప్పటికే అఫీషియల్ అనౌన్స్ మెంట్ కూడా వచ్చిన ఈ సినిమాని యువ సుధా ఆర్ట్స్, ఎన్టీర్ ఆర్ట్స్ సంస్థలు ఎంతో భారీ రేంజ్ లో ప్రతిష్టాత్మకంగా నిర్మించనుండగా దీనికి యువ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుద్ రవిచందర్ సంగీతం అందించనున్నట్లు టాక్. మంచి మెసేజ్ తో పాటు భారీ మాస్, కమర్షియల్ ఎంటర్టైనర్ గా రూపొందనున్న ఈ సినిమా లో ఒక ప్రముఖ కథానాయిక ఎన్టీఆర్ కి జోడీగా నటించనుండగా విలన్స్ పాత్రల్లో కోలీవుడ్ నటుడు విజయ్ సేతుపతి, మలయాళ నటుడు ఫహాద్ ఫాసిల్ నటించనున్నారు అనేది లేటెస్ట్ టాలీవుడ్ వర్గాల సమాచారం.

ఇప్పటికే ఈ పాత్రల కోసం పలువురిని పరిశీలించిన దర్శకుడు కొరటాల, రెండు రోజుల క్రితం ఫైనల్ గా వీరిద్దరినీ ఓకే చేసినట్లు చెప్తున్నారు. ఇటీవల విజయ్ ని, ఫహద్ ని కలిసి వారి నుండి ఆమోదం తో పాటు కాల్షీట్స్ కూడా ఆయన తీసుకున్నట్లు టాక్. మరి ప్రస్తుతం ప్రచారం అవుతున్న ఈ వార్తలో ఎంతవరకు నిజం ఉందొ తెలియాలి అంటే దీనిపై ఆ మూవీ యూనిట్ నుండి అఫీషియల్ గా అనౌన్స్ మెంట్ వచ్చే వరకు ఆగాల్సిందే అంటున్నారు సినీ విశ్లేషకులు. కాగా ఈ సినిమా త్వరలో సెట్స్ మీదకు వెళ్లనుండగా దీనిని వచ్చే ఏడాది వేసవికి ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు ....!!


మరింత సమాచారం తెలుసుకోండి: