ఒకనాటి చార్మింగ్ హీరోయిన్ ఛార్మి ఇప్పుడు నిర్మాతగా మారి తన స్నేహితుడు పూరీ జగన్నాథ్ తో కలిసి వరసపెట్టి సినిమాలు చేస్తోంది. ప్రస్తుతం వీరిద్దరి కాంబినేషన్ లో విజయ్ దేవరకొండ తో తీస్తున్న ‘లైగర్’ మూవీ బ్లాక్ బష్టర్ హిట్ అయితే తాను కూడ బ్లాక్ బష్టర్ మహిళా నిర్మాతగా మారాలని ఛార్మీ కలలు కంటోంది.


‘లైగర్’ మూవీని పాన్ ఇన్ ఇండియా మూవీగా నిర్మిస్తున్న పరిస్థితులలో ప్రస్తుతం కొనసాగుతున్న కరోనా పరిస్థితులు దేశం అంతా సద్దుమణిగాక విడుదల చేయాలని ఛార్మి పూరీలు భావిస్తున్నారు. ప్రస్తుతం వీరిద్దరూ ఎక్కువగా ముంబాయిలో ఉంటున్న పరిస్థితులలో లేటెస్ట్ గా ఛార్మీ ముగ్గురు దర్శకుల సీక్రెట్ సమాచారాన్ని తన ఫోటో ద్వారా బయటపెట్టి సోషల్ మీడియాలో హడావిడి చేసింది.



దర్శకులు పూరి జగన్నాధ్ క్రిష్ మోహన్ రాజ హేమంత్ మధుకర్ లు ముంబాయిలోని ఒక హోటల్ లో కూర్చుకుని మాట్లాడుకుంటున్న ఫోటోను షేర్ చేసి వారంతా ఏమి మాట్లాడుకుంటున్నారో ఊహించండి అంటూ తన అభిమానులకు ప్రశ్నలు వేసింది. ఛార్మీ షేర్ చేసిన ఫోటో పై స్పందిస్తూ వీరంతా తాము తీస్తున్న ‘లైగర్’ ‘గాడ్ ఫాదర్’ ‘హరి హరవీరమల్లు’ సినిమాల గురించి మాట్లాడుకుని ఉంటారని అభిప్రాయపడ్డారు.


మరికొందరైతే ప్రస్తుతం కొనసాగుతున్న కరోనా పరిస్థితులతో పాటు థర్డ్ వేవ్ వస్తే తమ సినిమాలను ఎప్పుడు ఎలా రిలీజ్ చేయాలి అన్న విషయాల పై మాట్లాడుకుంటూ మారిపోతున్న ప్రేక్షకుల అభిరుచి గురించి కూడ చర్చించి ఉంటారని ఊహాగానాలు చేసారు. ఈ ఊహాగానాలు ఎలా ఉన్నా ప్రస్తుతం ఈ నలుగురి దర్శకుల దృష్టి పాన్ ఇండియా మూవీల పై ఉంది. ప్రస్తుతం వీరు దర్శకత్వం వహిస్తున్న సినిమాలు వీరి కెరియర్ కు విషమ పరీక్షగా మారాయి. ఇలాంటి పరిస్థితులలో బీరంగా ఒకరికొకరు సలహాలు ఇచ్చుకుంటూ ఆనాటి డిన్నర్ ను ఎంజాయ్ చేసి ఉంటారని ఈ ఫోటో చూసిన వారి అభిప్రాయం..


మరింత సమాచారం తెలుసుకోండి: