రెండు రోజుల నుంచి బాలీవుడ్ నటుడు అర్మాన్ కోహ్లీ పేరు ప్రధానాంశాల్లో నిలుస్తోంది. దానికి కారణం డ్రగ్స్ కేసు. డ్రగ్స్ కేసులో అర్మాన్ కోహ్లీని నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో అరెస్ట్ చేసింది. ఈ సందర్భంగా ఆయనకు సంబంధించిన పలు ఆసక్తికర విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అందులో ముఖ్యంగా డ్రగ్స్ కేసులో అరెస్టయిన ఈ నటుడి వల్లే షారుక్ ఖాన్ ఫేమస్ అయ్యాడనే విషయం అందరి దృష్టినీ ఆకర్షిస్తోంది.

1992లో 'విత్రి' సినిమాతో అరంగ్రేటం చేసిన అర్మాన్ కోహ్లీకి "దివానా" చిత్రం ఆఫర్ వచ్చిందట. అయితే ఈ ఆఫర్ ను అర్మాన్ తిరస్కరించడంతో తర్వాత మేకర్స్ షారుక్ ఖాన్ ను సంప్రదించారట. షారుక్ కు హిందీలో ఇదే మొదటి చిత్రం. అంతే కాకుండా "దీవానా" చిత్రం ఆయనను ఓవర్ నైట్ స్టార్ ను చేసి పరిశ్రమలో నిలదొక్కుకోవడానికి సహాయ పడింది.

ఒకసారి షారుఖ్ ఖాన్ ఈ విషయం గురించి ఫిలింఫేర్ ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఈ సినిమాలో తన పర్ఫామెన్స్ చాలా భయంకరంగా ఉంటుందని, చాలా ఓవర్ ఆక్టింగ్ చేశానని, తెరపై తనను తాను చూసుకుని ఆశ్చర్యపోయానని చెప్పుకొచ్చాడు. అంతేకాకుండా ఆ సినిమాలో ప్రజలు తనను ఇష్టపడడం పెద్ద షాక్ అని, కానీ తాజా ముఖం కాబట్టి ప్రజలు ఆదరించి ఉండొచ్చని అభిప్రాయం వ్యక్తం చేశారు. ఇది తన కెరీర్ లో చెత్త పర్ఫామెన్స్ అని తెలిపాడు.

మరొకసారి 2016లో జరిగిన 'యాదన్ కి భారత్'లో షారుక్ తన సినీ కెరీర్ లో సక్సెస్ కు సంబంధించిన క్రెడిట్ ను అర్మాన్ కు ఇచ్చాడు. తాను స్టార్ గా మారడానికి అర్మాన్ కోహ్లీ కారణం అని చెప్పాడు. "దివానా" సినిమాలో ఆర్మాన్ ను హీరోగా అనుకోవడంతో హీరోయిన్ దివ్య భారతితో కలిసి ఆయనకు సంబంధించిన పోస్టర్ ను మేకర్స్ రూపొందించారట. అది షారుఖ్ దగ్గర ఇప్పటికీ భద్రంగా ఉందట. ఈ సినిమాతో తనకు సాయం చేసినందుకు అర్మాన్ కు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.  

మరింత సమాచారం తెలుసుకోండి: