టాలీవుడ్ పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ సినిమా రాధేశ్యామ్ వచ్చే ఏడాది సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రానున్న విషయం తెలిసిందే. రిట్రో లవ్ స్టోరీ మూవీ గా తెరకెక్కిన ఈ సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్ గా నటించగా జిల్ మూవీ ఫేమ్ రాధాకృష్ణ దీనిని ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించారు. భాగ్యశ్రీ, కృష్ణంరాజు, జయరాం తదితరులు ఇతర పాత్రలు పోషించిన ఈ సినిమాని యువి క్రియేషన్స్ బ్యానర్ పై ప్రమోద్, వంశీ ఎంతో భారీ వ్యయంతో నిర్మించారు. అయితే దీనితో పాటు ప్రభాస్ మరొక మూడు సినిమాలు కూడా చేస్తున్నారు.

వాటిలో ముందుగా ప్రభాస్ రాముడిగా బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ తీస్తున్న భారీ మైథలాజికల్ సినిమా ఆదిపురుష్ ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. అలానే మరోవైపు వైజయంతి మూవీస్ బ్యానర్ పై సి అశ్వినీదత్ నిర్మాతగా నాగ అశ్విన్ తీస్తున్న ప్రాజక్ట్ కె మూవీలో కూడా ప్రభాస్ యాక్ట్ చేస్తున్నారు. దీపికా పడుకొనే, అమితాబ్ బచ్చన్ వంటి పెద్ద స్టార్స్ నటిస్తున్న ఈ మూవీ కూడా ప్రస్తుతం షూట్ జరుపుకుంటుండగా, దీనితో పాటు సలార్ అనే భారీ మాస్, యాక్షన్ ఎంటర్టైనర్ కూడా చేస్తున్నారు ప్రభాస్. కెజిఎఫ్ సినిమా దర్శకుడు ప్రశాంత్ నీల్ తీస్తున్న ఈ గ్రాండ్ మాస్ మూవీలో శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తుండగా కన్నడ ప్రముఖ సంస్థ హోంబలె ఫిలిమ్స్ వారు దీనిని ఎంతో భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు.

అయితే విషయం ఏమిటంటే, మొత్తంగా ప్రభాస్ నటిస్తున్న ఈ నాలుగు సినిమాలకి కలిపి ఏకంగా రూ.1000 కోట్లకు పైగా బడ్జెట్ కేటాయించినట్లు టాలీవుడ్ వర్గాల టాక్. అయితే ఈ నాలుగు సినిమాల్లో ప్రాజెక్ట్ కె మూవీకి అత్యధిక ఖర్చు చేస్తున్నారట మేకర్స్, ఈ మూవీ ఇండియన్ సినిమా హిస్టరీ లోనే అత్యధిక వ్యయంతో రూపొందుతోందని సమాచారం. అలానే ఈ సినిమాలలో రాధేశ్యామ్ ఇప్పటికే చాలా ఏరియాల్లో ప్రీ రిలీజ్ బిజినెస్ జరుపుకోగా మిగతా మూడు సినిమాలకు కూడా ఎంతో భారీ స్థాయిలో బిజినెస్ జరుగనుననట్లు తెలుస్తోంది. కాగా ఈ సినిమాలు కనుక పెద్ద సక్సెస్ అయితే హీరోగా ప్రభాస్ రేంజ్ మరింత విపరీతంగా పెరగడం ఖాయం అంటున్నారు ట్రేడ్ అనలిస్టులు.

మరింత సమాచారం తెలుసుకోండి: