తొలిసారిగా అల్లరి నరేష్, శర్వానంద్ లతో హృద్యమైన సినిమాల దర్శకుడు క్రిష్ జాగర్లమూడి తీసిన సినిమా గమ్యం. అప్పట్లో ఈ సినిమా విడుదల తరువాత మంచి సక్సెస్ అందుకోవడంతో పాటు ఫస్ట్ సినిమా ద్వారా క్రిష్ కి దర్శకుడిగా ఆడియన్స్ లో మంచి పేరు తెచ్చిపెట్టింది. ఆ తరువాత అల్లు అర్జున్, అనుష్క లతో వేదం, రానా తో కృష్ణం వందే జగద్గురుమ్ వంటి సినిమాలతో మరొక రెండు విజయాలు అందుకున్న క్రిష్, అనంతరం కంచె, గౌతమి పుత్ర శాతకర్ణి సినిమాలు తీసి వాటి ద్వారా కూడా విజయాలు సొంతం చేసుకున్నారు.

అయితే ఇటీవల బాలయ్య తో ఎన్టీఆర్ బయోపిక్ సినిమాలైన ఎన్టీఆర్ కథానాయకుడు, మహానాయకుడు సినిమాలు తీసి కెరీర్ పరంగా పరాజయాలు సొంతం చేసుకున్న క్రిష్ ప్రస్తుతం వరుణ్ తేజ్ తో కొండా పొలం తో పాటు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో హరిహర వీరమల్లు సినిమాలు తీస్తున్న విషయం తెలిసిందే. నిజానికి కొండా పొలం కంటే ముందే పవన్ హరిహర వీరమల్ల్లు మూవీ షూట్ ప్రారంభం అయింది. అయితే అది భారీ పీరియాడిక్ సినిమా కావడంతో పాటు ప్రస్తుతం పవన్ కళ్యాణ్ భీమ్లా నాయక్ సినిమా చేస్తుండడంతో దానిని కొన్నాళ్ళు ప్రక్కన పెట్టినట్లు సమాచారం.

నిజానికి ఇటీవల కొంత మేర షూట్ జరుపుకున్న ఈ సినిమాలో పవన్, వీరమల్లు అనే గజ దొంగ పాత్ర చేస్తుండగా నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తోంది. అయితే క్రిష్ తీసిన లేటెస్ట్ మూవీ కొండపొలం ట్రైలర్ నిన్న విడుదలై అందరినీ ఆకట్టుకుంటూ ఉండడంతో పలువురు పవన్ ఫ్యాన్స్, తమ హీరో నటిస్తున్న హరిహర వీరమల్లు అప్ డేట్ కావాలంటూ క్రిష్ ని ఉద్దేశించి సోషల్ మీడియా అకౌంట్స్ లో కామెంట్స్ చేస్తున్నారు. కాగా త్వరలో తదుపరి షెడ్యూల్ తో పట్టాలెక్కనున్న ఈ సినిమా నుండి మరొక నెలలో ఒక అప్ డేట్ రానుందని అంటున్నారు. మరి తొలిసారిగా పవర్ స్టార్ తో క్రిష్ తీస్తున్న ఈ సినిమా ఎంత మేర విజయం అందుకుంటుందో చూడాలి.  

మరింత సమాచారం తెలుసుకోండి: