తెలుగు చిత్ర పరిశ్రమలో అందరూ చర్చించుకుంటున్నది ఒక్కటే. నాగచైతన్య సమంత విడాకుల గురించి. ఎందుకంటే అటు తెలుగు సిని సెలబ్రెటీలతో పాటు తెలుగు ప్రేక్షకులు కూడా వీరిద్దరూ విడాకులు తీసుకుంటారు అనే విషయాన్ని కలలో కూడా ఊహించి ఉండరు. ఒకరి పట్ల ఒకరికి అమితమైన ప్రేమతో ఉండే వీరిద్దరూ విడాకులు తీసుకోవడాన్ని ఇప్పటికి కూడా ప్రేక్షకులు నమ్మలేకపోతున్నారూ అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఇక టాలీవుడ్ లో మోస్ట్ లవ్లీ కపుల్స్ గా ఉన్న ఇద్దరు ఎందుకు విడిపోయారు అనే దాని పైనే ప్రస్తుతం చర్చ జరుగుతోంది. అయితే అటు సమంత పై ఎంతోమంది కామెంట్లు చేయడం కూడా చేస్తున్నారు.



 సమంత ఎఫైర్ల కారణంగానే నాగచైతన్య విడాకులు తీసుకున్నాడు అని అంతేకాదు సమంత అవకాశవాది అంటూ రాయాల్సిన వార్తలన్నీ ఇప్పటికే అందరూ రాసేశారు. ఇక ఇప్పటి వరకు సమంత గురించి చేయాల్సిన దుష్ప్రచారం మొత్తం సోషల్ మీడియాలో చేసేసారు.  ఇటీవల తనపై వస్తున్న దుష్ప్రచారం పై స్పందించిన సమంత ఆవేదన వ్యక్తం చేసింది. ఇప్పటికే విడాకుల బాధలో ఉంటే ఇప్పుడు పర్సనల్గా ఎటాక్ చేస్తారా అంటూ బాధపడింది. అయితే సమంత పిల్లలను కనేందుకు నో చెప్పడం కారణంగానే నాగచైతన్య విడాకులు తీసుకున్నాడు అన్నది ఎక్కువగా వినిపిస్తున్న టాక్. ఇటీవల ఇదే విషయంపై శాకుంతలం సినిమా నిర్మాత సంచలనం  విషయాలను బయటపెట్టారు.



 శాకుంతలం నిర్మాత నీలిమ గుణ ఇటీవలే ఓ జాతీయ మీడియా సంస్థతో మాట్లాడింది. శాకుంతలం సినిమా గురించి సమంత ను సంప్రదించడం గురించి.. జరిగిన విషయాల గురించి చెప్పుకొచ్చారు ఆమె. సినిమా గురించి సమంత ను సంప్రదించిన సమయంలో తాను సినిమాలు చేయకూడదని ఫిక్సయ్యా అంటూ సమంత చెప్పింది.  కానీ పిరియాడిక్ సినిమా కావడంతో చివరికి ఓకే చెప్పింది. కానీ కొన్ని కండిషన్ పెట్టింది. త్వరగా షూటింగ్ పూర్తి చేయాలని ఎందుకంటే ఫ్యామిలీ ప్లానింగ్ లో ఉన్నాను అంటూ సమంత చెప్పింది. షూటింగ్ త్వరగా పూర్తి చేస్తామని మాట ఇచ్చిన తర్వాతే సమంత సినిమా చేయడానికి ఒప్పుకుంది అంటూ శాకుంతలం నిర్మాత నీలిమ గుణ చెప్పుకొచ్చారు. దీన్ని బట్టి చూస్తే నిజంగానే మొన్నటికి మొన్న మాధవి లత చెప్పిన మాటలు నిజమేనా అన్న అనుమానం కలుగుతోంది. పిల్లల్ని కనడానికి సమంత సిద్ధంగా ఉన్నప్పటికీ ఎందుకు నాగచైతన్య విడాకులు ఇచ్చాడు అన్నది ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారిపోయింది.

మరింత సమాచారం తెలుసుకోండి: