పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా మారిన సంగతి తెలిసిందే. పవన్ కళ్యాణ్ ప్రస్తుతం నటిస్తున్న సినిమాలో 'హరిహర వీరమల్లు' సినిమా కూడా ఒకటి. వైవిధ్య చిత్రాల దర్శకుడు క్రిష్ జాగర్లమూడి ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నారు. మెగా సూర్య ప్రొడక్షన్స్ బ్యానర్ పై ఏఎమ్ రత్నం ఈ సినిమాను ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో రూపొందుతున్న ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ కి జోడిగా నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తోంది. పీరియాడికల్ డ్రామాగా క్రిష్ ఈ సినిమాను తెరకెక్కిస్తుండగా ఈ సినిమా షూటింగ్ చాలా రోజుల కిందటే స్టార్ట్ అయింది.

కానీ మధ్యలో కరోనా సెకండ్ కారణంగా ఈ సినిమా షూటింగ్ కి బ్రేక్ పడింది. ఇక ఈ సినిమా షూటింగ్ ఆగిపోయిన తర్వాత దర్శకుడు క్రిష్ వైష్ణవ్ తేజ్ హీరోగా 'కొండపొలం' అనే సినిమాకి దర్శకత్వం వహించాడు. అటు పవన్ కళ్యాణ్ కూడా ఈ సినిమా షూటింగ్ నుండి బ్రేక్ తీసుకొని భీమ్లా నాయక్ సినిమా షూటింగ్ తో బిజీగా ఉన్నాడు. ఈ సినిమా షూటింగ్ దాదాపు పూర్తి కావచ్చింది. ఇక ఇదిలా ఉంటే తాజా సమాచారం ప్రకారం త్వరలోనే హరిహర వీరమల్లు సినిమా తిరిగి సెట్స్ పైకి వెళ్లనుంది. ఇందుకు సంబంధించి దర్శకుడు క్రిష్ ప్రస్తుతం లొకేషన్ల వేటలో ఉన్నారు.

క లొకేషన్స్ సెలక్షన్ పూర్తయిన వెంటనే ఈ సినిమా షూటింగ్ ని తిరిగి చిత్ర యూనిట్ ప్రారంభించబోతున్న ట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే ఈ సినిమా నుండి విడుదలైన టీజర్ కి ప్రేక్షకుల్లో భారీ స్పందన రావడంతో పాటు సినిమాపై అంచనాలు భారీగా క్రియేట్ అయ్యాయి. ఇక పవన్ కళ్యాణ్ తో పాటు ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్స్ అర్జున్ రాంపాల్, జాక్వెలిన్ ఫెర్నాండెజ్ సైతం పలు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. మరోవైపు పవన్ కళ్యాణ్ కెరీర్ లో మొట్టమొదటి పాన్ ఇండియా సినిమా ఇదే కావడం విశేషం. దీంతో ఈ సినిమా కోసం పవన్ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.దీంతో వీలైనంత త్వరగా షూటింగ్ పూర్తి చేసి వేసవి కానుకగా సినిమాను విడుదల చేయాలని సన్నాహాలు చేస్తున్నారు...!!

మరింత సమాచారం తెలుసుకోండి: