కింగ్ నాగార్జున హోస్ట్‌గా వ్యవహరిస్తున్న బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ తెలుగు సీజన్-5 ఫైనల్‌కు చేరుకుందట.గత 100 రోజులకు పైగా బుల్లితెర ప్రేక్షకులను విశేషంగా అలరిస్తున్న ఈ బిగ్ బాస్ -5 నేటితో ముగియనుందని తెలుస్తుంది.

నేడు గ్రాండ్ ఫినాలే ఎపిసోడ్ ప్రసారం కానుండగా.. ఈ గ్రాండ్ ఫినాలేకి టాలీవుడ్ మరియు బాలీవుడ్ తారలు వచ్చి సందడి చేయనున్నారట.పాన్ ఇండియన్ మూవీ 'ఆర్ఆర్ఆర్' చిత్రం ప్రమోషన్ కోసం రాజమౌళి ఈ కార్యక్రమంలో వచ్చి సర్‌ప్రైజ్ చేయబోతున్నారని తెలుస్తుంది.. శ్రియ శరణ్ స్పెషల్ సాంగ్‌లో ఆడిపాదిండని తెలుస్తుంది.అలాగే, 'పుష్ప' చిత్రం బృందం మరియు దర్శకుడు సుకుమార్, హీరోయిన్ రష్మిక మందన్న మరియు సంగీత దర్శకుడు దేవిశ్రీప్రసాద్ వస్తున్నారని సమాచారం.

'శ్యామ్ సింగ రాయ్' టీమ్ హీరో నేచురల్ స్టార్ నాని, హీరోయిన్స్ సాయిపల్లవి మరియు కృతి శెట్టి బిగ్ బాస్ ఇంట్లోకి వెళ్లి అల్లరి చేయనున్నారట . వీరు మాత్రమే కాదు బాలీవుడ్ నుంచి 'బ్రహ్మాస్త్ర' చిత్రం కోసం రణబీర్ కపూర్ మరియు అలియాభట్ వచ్చి అలరించనున్నారట.మొత్తంగా నేటి గ్రాండ్ ఫినాలే అంత్యంత గ్రాండ్‌గా ఉండబోతోందని తాజాగా బిగ్ బాస్ నిర్వాహకులు వదిలిన ప్రోమో చూస్తే అర్థమవుతోందని సమాచారం.ఇక బిగ్ బాస్ సీజన్-5లో ఫైనల్ వరకు సన్నీ మరియు షణ్ముఖ్, శ్రీరామచంద్ర, మానస్ మరియు సిరి వచ్చారట అయితే, బిగ్ బాస్-5 టైటిల్‌ను సన్నీ గెలుచుకున్నట్టు సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోందని సమాచారం.ఇందులో ఎంతవరకు నిజమెంతో మరికొన్ని గంటల్లో తేలిపోనుందట.. కాగా ఈ గ్రాండ్ ఫినాలే ఈవెంట్ ఈరోజు సాయంత్రం 6 గంటల నుంచి స్టార్ మా చానల్‌లో ప్రసారం కానుందని తెలుస్తుంది.మరి చూడాలి బిగ్ బాస్ విన్నర్ ఎవరు కాబోతున్నారో. ఈ ఫినాలే అన్ని సీజన్స్ కంటే కొత్తగా ఉండబోతుందని తెలుస్తుంది. బిగ్ స్టార్ తో కొత్తగా ట్రై చేసారని తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: