మెగా సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ్ ఇటీవల 'రిపబ్లిక్' అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం అందరికి తెలిసిందే. విభిన్న కథా చిత్రాల దర్శకుడు దేవాకట్టా ఈ సినిమాకి దర్శకత్వం వహించారు. సాయిధరమ్ తేజ్ సరసన ఐశ్వర్య రాజేష్ హీరోయిన్గా నటించిన ఈ సినిమా ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంది. కరోనా ప్రభావం కనుక లేకపోయి ఉంటే ఈ సినిమా కమర్షియల్గా కూడా మంచి విజయాన్ని అందుకునేది. అయితే ఈ సినిమాలో ముఖ్యంగా మేకింగ్ పరంగా మరియు సాయి ధరమ్ తేజ్ పెర్ఫార్మెన్స్ పరంగా ఈ సినిమా విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ఒక మంచి కథతో రిపబ్లిక్ సినిమాను తెరకెక్కించిన దర్శకుడు దేవాకట్టా ను ప్రతి ఒక్కరూ అభినందించారు.

అంతేకాదు ఇలాంటి కాన్సెప్ట్ బేస్డ్ ఓరియంటెడ్ సినిమాలు తెలుగు ఇండస్ట్రీలో ఇంకా చాలా రావాలని అభిప్రాయపడిన సినీ ప్రముఖులు చాలామంది ఉన్నారు. ఇక రిపబ్లిక్ సినిమాలో ప్రస్తుత రాజకీయ పరిస్థితులు ఎలా ఉన్నాయి. వాటి వల్ల న్యాయవ్యవస్థ తో పాటు ఇతర వ్యవస్థలు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి అనే వాటి గురించి ఎంతో అద్భుతంగా చూపించారు దర్శకుడు దేవా కట్టా. ఇక ఇదిలా ఉంటే ఈ చిత్రానికి కొనసాగింపుగా 'రిపబ్లిక్ 2' సినిమాను తీస్తానని స్వయంగా దర్శకుడు దేవకట్టా చెప్పుకొచ్చారు. అయితే ఈసారి సాయి ధరమ్ తేజ్ తో కాకుండా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో తీస్తానని ఆయన అన్నారు.

అంతేకాదు ఇప్పటికే పవన్ కళ్యాణ్ గారి కోసం కథను సిద్ధం చేస్తున్నట్లు దేవకట్టా అధికారికంగా ప్రకటించారు.మరి రిపబ్లిక్ 2 సినిమాను పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో చేయాలనుకుంటున్న దేవకట్టకి ఆ అవకాశం దక్కుతుందా అనేది చూడాలి. అంతేకాకుండా పవన్ కళ్యాణ్ కూడా ఇలాంటి ఒక పొలిటికల్ బ్యాక్ డ్రాప్ తో సాగే సినిమా చేయాలని చాలా రోజులనుంచి అనుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే దేవాకట్ట కు పవన్ ఛాన్స్ ఇస్తారేమో చూడాలి. ఇక ప్రస్తుతం పవన్ కళ్యాణ్  కమిటైన ప్రాజెక్టులన్నీ పూర్తి కావడానికి చాలా సమయం పడుతుంది. మరి ఆ లోపు దేవాకట్ట మంచి స్క్రిప్టు సిద్ధం చేసి పవన్ కళ్యాణ్ ని ఒప్పిస్తే కచ్చితంగా సినిమా పట్టాలెక్కడం ఖాయం అని చెప్పవచ్చు...!!

మరింత సమాచారం తెలుసుకోండి: