ఒకప్పుడు తెలుగు చిత్ర పరిశ్రమలో కేవలం స్టార్ హీరోయిన్గా కొనసాగుతున్న వారితోనే సినిమాలు తీసేవారు దర్శక నిర్మాతలు. ఇక స్టార్ హీరోయిన్ ని పెట్టుకుంటే వారి క్రేజ్ కూడా సినిమాకు కలిసి వస్తుంది అని అనుకునే వారు. కానీ ఇటీవలి కాలంలో మాత్రం దాదాపుగా కొత్త హీరోయిన్ లతో సినిమాలు తీసేందుకు ఎక్కువగా ఆసక్తి చూపుతున్నారు. కొత్త హీరోయిన్లు కొత్త కథతో ప్రేక్షకుల ముందుకు వస్తూ మంచి విజయాలను అందుకుంటున్నారు. ఇలా ఇటీవలి కాలంలో తెలుగు చిత్ర పరిశ్రమలో ఒక్కరు ఇద్దరు కాదు దాదాపుగా అరడజనుకు పైగా  హీరోయిన్ లు ఎంట్రీ ఇస్తున్నారు. ఈ క్రమంలోనే ఇక మరికొన్ని రోజుల్లో ఈ ఏడాది ముగిసిపోతున్న నేపథ్యంలో ఇక ఈ ఏడాది టాలీవుడ్ చిత్ర పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చిన కొత్తహీరోయిన్లు ఎవరు అని తెలుసుకుంటున్నారు ప్రేక్షకులు.


 కొత్త హీరోయిన్లు ఎవరో ఇప్పుడు తెలుసుకుందాం..

 కృతి శెట్టి : ఉప్పెన అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది ఈ ముద్దుగుమ్మ  ఇక ఇదే సినిమాతో మెగా హీరో వైష్ణవ్ తేజ్.. దర్శకుడిగా  సుకుమార్ శిష్యుడు చిట్టి బాబు పరిచయమయ్యారు. డిఫరెంట్ కాన్సెప్ట్ తో వచ్చిన ఈ సినిమా మంచి విజయాన్ని సాధించింది.  మొదటి సినిమా మంచి విజయం సాధించడంతో ఈ అమ్మడికి ఒక్కసారిగా క్రేజీ వచ్చింది. ఇప్పుడు వరుస సినిమాలు చేసుకుంటూ దూసుకుపోతుంది.

 శ్రీలీల : దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు తెరకెక్కించిన పెళ్లి సందd సినిమా తో ప్రేక్షకుల ముందుకు వచ్చింది ఈ ముద్దుగుమ్మ. ఈ సినిమాలో శ్రీకాంత్ కొడుకు హీరోగా నటించాడు. కామెడీ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమా మంచి విజయాన్ని సాధించింది. ముఖ్యంగా శ్రీలీల తన అందం అభినయంతో ఎంతోమంది ఆకట్టుకుంది.


 ఫరియా అబ్దుల్లా : జాతి రత్నాలు అనే సినిమాతో తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చి చిట్టి గా తెలుగు ప్రేక్షకుల గుండెల్లో స్థానం సంపాదించుకుంది ఈ ముద్దుగుమ్మ.. మొదటి సినిమాతోనే నటనతో మంచి మార్కులు కూడా కొట్టేసింది.

 శివాని రాజశేఖర్ : హీరో రాజశేఖర్ కూతురు శివాత్మిక ఇప్పటికే  హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. ఇక రెండో కూతురు శివాని ఇటీవలే అద్భుతం అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే సినిమా అనుకున్నంతగా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది.


 కేతిక శర్మ : పూరి జగన్నాథ్ కొడుకు ఆకాష్ హీరోగా తెరకెక్కిన రొమాంటిక్ సినిమాలో కేతిక శర్మ హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. మొదటి సినిమాతోనే బోల్డ్ పాత్రలో నటించి ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇప్పుడు వరుస అవకాశాలు సొంతం చేసుకుని దూసుకుపోతోంది.


 ప్రియా ప్రకాష్ వారియర్ : ఒకప్పుడు  కన్నుగీటి  ఓవర్ నైట్ స్టార్ హీరోయిన్ గా మారిన ప్రియా ప్రకాష్ వారియర్ తెలుగులోకి అఫీషియల్ గా హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది నితిన్ హీరోగా నటించిన చెక్ సినిమాతో. అయితే ఈ సినిమా అంతగా రాణించకపోవటంతో ఈ అమ్మడికి కూడా ఎక్కువగా గుర్తింపు రాలేదు.


 అమృత అయ్యర్ : యాంకర్ ప్రదీప్ మాచిరాజు హీరోగా 30 రోజుల్లో ప్రేమించడం ఎలా అనే సినిమాలో హీరోయిన్ గా నటించింది అమృత అయ్యర్. తన చిలిపి నవ్వుతోనే తెలుగు ప్రేక్షకుల మదిని దోచింది. ఇక 2021 సంవత్సరం లో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చినా ముద్దుగుమ్మ గా నిలిచింది ఈ అమ్మడు.

మరింత సమాచారం తెలుసుకోండి: