సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తన తదుపరి చిత్రమైన‌ ‘ఎస్ఎస్ఎంబి28’ షూటింగ్ కోసం దుబాయ్‌లోనే ఉన్నారు. పనితో పాటు ఈ హీరో ఫ్యామిలీతో అక్కడే క్వాలిటీ స‌మ‌యంతో  స్పెండ్ చేస్తున్నాడు. మహేష్ సతీమణి నమ్రత శిరోద్కర్ తరచుగా వారి కుటుంబానికి సంబంధించిన అద్భుతమైన క్షణాలను కెమెరాలో బంధించి.. సోషల్ మీడియాలో అభిమానులతో స‌ర‌దాగా పంచుకుంటూ ఉంటుంది.

తాజాగా మహేష్ తన కుమార్తె సితారతో కలిసి ఉన్న  సూప‌ర్ లుక్‌లో అద్భుతంగా ఓ చిత్రాన్ని ఇన్‌స్టాలో పంచుకున్నారు. ఇది చూడ‌గానే అభిమానులంద‌రూ త‌న‌దైన శైలిలో కామెంట్ చేస్తున్నారు. ఈ పొటోలో మ‌హేష్‌, సితారాతో క‌లిసి బ్రేక్ ఫాస్ట్ కోసం వెళ్లుతున్న‌ట్టు తెలుస్తుంది. ఇక వీరిద్ధ‌రి దుస్తుల ఫ్యాష‌న్ ఎంత‌గానో ఆక‌ట్టుకుంటున్న‌ది. న‌మ్ర‌త త‌న ఇన్‌స్టాగ్రామ్‌లో ఈ ఫోటోను పంచుకుంటూ ఒక బీటీఎస్ క‌థ‌ను కూడా రాసేసింది. అసంఖ్యాక‌మైన ప‌క్షులు, తేనేటీగ‌లు వంటి అంద‌మైన జీవుల మ‌ధ్య ప‌చ్చిక బ‌య‌ళ్ల‌లో వారి రుచిక‌ర‌మైన అల్పాహారం తిన‌డానికి సిద్ధంగా ఉన్న ఈ ఇద్ద‌రికీ తెల్ల‌వారుజామున ఎప్పుడూ ప‌ని ఉండ‌దు అని రాసింది.

సూపర్ స్టార్ మహేష్ బాబు ఎంత ఏజ్ వచ్చినా తరగని అందంతో మెరిసిపోతూ ఉంటారు.  ఆరోగ్యం కోసం చాలా కేర్ తీసుకుంటారు ప్రిన్స్‌ మహేష్.  తాను  ఎక్కడికి వెళ్లినా తనకు సపరేట్ చెఫ్ కూడా ఉంటాడ‌ట‌.  ఇటీవలే  మోకాలి శస్త్రచికిత్స కోసం మహేశ్‌ స్పెయిన్ వెళ్లి  మోకాలికి ఆపరేషన్ చేయించుకున్నారు.   ఇన్ని రోజులు స్పెయిన్ లో విశ్రాంతి తీసుకున్న‌ మహేష్ బాబు   ఈ నెల 24న స్పెయిన్ నుంచి దుబాయ్ కి వెళ్లారు. అయితే అక్క‌డ కుటుంబంతో గ‌డుపుతున్నారు.

ముఖ్యంగా అవును.. రోజుకి సంబంధించిన ప్లాన్ ప్రతిరోజూ ఇక్కడే టన్నెల్‌లో రూపొందుతున్న‌ది. ప్రతీ ఉదయం ఒక తాజా గమనికతో తయారవుతుంది. సో ఈ రోజు నేను ఈ విజువల్ క్యాప్చర్‌ని తీయడానికి ముందుకు నడిచాను అని చెప్పింది. కాబట్టి నేను కార్డ్‌లలోని మెనుని కోల్పోయాను అని,  కానీ అది ఆమెకు అప్పగించాలి అని వివ‌రించింది. ఆమె అల్పాహారం ఉత్తమమైనది, తక్కువ సంక్లిష్టమైంది. నేను ఈ ఇద్దరి నుంచి నేర్చుకోవడం ప్రారంభించే సమయం ఆసన్నమైన‌దని భావిస్తున్నా అని తండ్రీ, కూతురు గురించి సుదీర్ఘమైన పోస్టును  నమ్రత పంచుకుంది.


మరింత సమాచారం తెలుసుకోండి: