సూపర్ స్టార్ మహేష్ బాబు రెండేళ్ల క్రితం అనిల్ రావిపూడి తీసిన సరిలేరు నీకెవ్వరు మూవీ ద్వారా సంక్రాంతి బరిలో నిలిచి సూపర్ డూపర్ హిట్ కొట్టారు. మహేష్ కెరీర్ 26వ సినిమాగా తెరకెక్కిన సరిలేరులో రష్మిక మందన్న హీరోయిన్ గా నటించగా రాక్ స్టార్ దేవిశ్రీప్రసాద్ దానికి సంగీతం అందించారు. ఇక ఆ మూవీ అనంతరం పరశురామ్ తో సర్కారు వారి పాట సినిమా చేయడానికి సిద్ధం అయిన మహేష్, అప్పటి నుండి ఆ మూవీ షూట్ లో పాల్గొంటున్నారు. ఎస్ థమన్ సంగీతం అందిస్తున్న సర్కారు వారి పాట మూవీని 14 రీల్స్ ప్లస్, జిఎంబి ఎంటర్టైన్మెంట్స్, మైత్రి మూవీ మేకర్ వారు ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తుండగా కీర్తి సురేష్ ఇందులో కథానాయికగా యాక్ట్ చేస్తోంది.
వాస్తవానికి ఈ సినిమాని జనవరి 12న సంక్రాంతి కానుకగా రిలీజ్ చేద్దాం అని భావించిన యూనిట్, ఇటీవల ఆర్ ఆర్ ఆర్ అదే సమయానికి రిలీజ్ అవుతుండడంతో తమ మూవీని ఏప్రిల్ 1కి వాయిదా వేసుకున్నారు. తమ సూపర్ స్టార్ సినిమా ఒక్కసారిగా నాలుగు నెలలు వెనక్కి వెళ్లడంతో సూపర్ స్టార్ ఫ్యాన్స్ లో ఒకింత ఆవేదన వ్యక్తం అయింది. అయితే లేటెస్ట్ గా మహేష్ బాబు మేనల్లుడు గల్లా జయదేవ్ కుమారుడైన గల్లా అశోక్ నటిస్తున్న ఫస్ట్ మూవీ హీరో, సంక్రాంతి సందర్భంగా జనవరి 15న ఆడియన్స్ ముందుకు వస్తున్నట్లుగా నేడు అధికారికంగా ప్రకటన వచ్చింది. శమంతకమణి, దేవదాసు సినిమాల దర్శకుడు శ్రీరామ్ ఆదిత్య తీస్తున్న హీరో మూవీలో నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తుండగా జీబ్రాన్ సంగీతం అందిస్తున్నారు.

అమర్ రాజా మీడియా వారు ఎంతో భారీ వ్యయంతో నిర్మిస్తున్న ఈ సినిమా సంక్రాంతి బరిలో నిలవడం సూపర్ స్టార్ ఫ్యాన్స్ కి ఒకింత ఆనందాన్నిచ్చే విషయం అనే చెప్పాలి. ఒకరకంగా ఈ సంక్రాంతికి సూపర్ స్టార్ బాక్సాఫీస్ బరిలో నిలుస్తారు అనుకుంటే ఫైనల్ గా ఆయన మేనల్లుడి సినిమా వస్తుండడం ఆనందంగా ఉందని, తప్పకుండా అశోక్ నటిస్తున్న ఫస్ట్ మూవీ హీరో సూపర్ హిట్ కొట్టి తీరుతుందని పలువురు ఘట్టమనేని అభిమానులు అతడికి ముందస్తుగా తమ సోషల్ మీడియా అకౌంట్స్ ద్వారా అభినందనలు తెలియ చేస్తున్నారు. మరోవైపు ఇటీవల రిలీజ్ అయిన ఈ సినిమాలోని సాంగ్స్, టీజర్ అందరినీ ఆకట్టుకుని మూవీపై బాగానే అంచనాలు ఏర్పరిచాయి. మరి ఫస్ట్ సినిమాతో మహేష్ మేనల్లుడు అశోక్ ఎంత మేర సక్సెస్ అందుకుంటారో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: