టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా లేటెస్ట్ గా తెరకెక్కుతున్న సర్కారు వారి పాట మూవీ వాస్తవానికి జనవరి 13న సంక్రాంతి కానుకగా రిలీజ్ కావాల్సి ఉండగా పాన్ ఇండియా సినిమా ఆర్ఆర్ఆర్ జనవరి 7న రిలీజ్ కానున్నట్లు ప్రకటించడంతో దానికోసం తన సినిమాని ఏప్రిల్ కి వాయిదా వేశారు మహేష్ బాబు. ఇక సర్కారు వారి పాట మూవీ కోసం మహేష్ ఫ్యాన్స్ మాత్రమే కాదు నార్మల్ ఆడియన్స్ కూడా ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నారు.
రెండేళ్ల క్రితం సంక్రాంతి కానుకగా సరిలేరు నీకెవ్వరు మూవీ ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చిన మహేష్ బాబు నుండి ఇప్పటివరకు మరొక మూవీ రాకపోవడంతో ఆయన ఫ్యాన్స్ ఎంతో నిరాశకు గురవుతున్నారు అనే చెప్పాలి. ఇక సర్కారు వారి పాట సినిమా విషయానికి వస్తే ఇప్పటికే ఈ మూవీ చాలా వరకు షూటింగ్ పూర్తి చేసుకోగా ఇటీవల తన మోకాలికి సర్జరీ చేయించుకున్న మహేష్, ప్రస్తుతం తన ఫ్యామిలీ తో కలిసి అక్కడే రెస్ట్ తీసుకుంటున్నారు.

అయితే విషయం ఏమిటంటే మొన్న న్యూ ఇయర్ సందర్భంగా దుబాయ్ లోని బుర్జ్ ఖలీఫా భవనం పై న్యూ ఇయర్ వేడుకలు కుటుంబంతో ఎంతో సరదాగా జరుపుకున్న మహేష్, అక్కడ దిగిన తన ఫ్యామిలీ పిక్ ని పోస్ట్ చేసారు. అయితే మహేష్ బాబు ఇన్స్టా లో పోస్ట్ చేసిన ఈ ఫోటో ప్రస్తుతం 1 మిలియన్ లైక్స్ ని సొంతం చేసుకుంది. గతంలో మహేష్ తన లేటెస్ట్ స్టైల్ ట్రెండీ లుక్స్ లో ఉన్న ఒక పిక్ ని పోస్ట్ చేసి దానికి కూడా 1 మిలియన్ లైక్స్ అందుకున్నారు. ఇక ప్రస్తుతం మహేష్ కి ఇన్స్టా లో 7. 6 మిలియన్ల ఫాలోవర్లు ఉన్నారు. అలానే పలు ఇతర సోషల్ మీడియా మాధ్యమాల్లో కూడా అకౌంట్స్ కలిగి ఉన్న సూపర్ స్టార్ మహేష్, ఎప్పటికప్పుడు తన సినిమాలు, వ్యక్తిగత విషయాలు గురించి తరచు ప్రేక్షకులు, అభిమానులతో పంచుకుంటూ ఉంటారు.

మరింత సమాచారం తెలుసుకోండి: