ప్రేమమ్ సినిమా తో వెండి తెరకు పరిచయం అయ్యింది అనుపమా పరమేశ్వరన్.. మలయాళ చిత్ర సీమ ద్వారా ఎంట్రీ ఇచ్చి ఇప్పుడు తెలుగు చిత్ర పరిశ్రమలో తనకంటూ ప్రత్యేక గుర్థింపును తెచ్చుకుంది.. ఆ తర్వాత మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ తెరకెక్కించిన అఆ సినిమా తో తెలుగు ఇండస్ట్రీ కి పరిచయం అయ్యింది. ఆ సినిమా లో మంచి పేరు తెచ్చుకుంది.. ఆ సినిమా తర్వాత ఇప్పుడు వరుస ఆఫర్ల తో దూసుకుపోతుంది..



తెలుగు ప్రేమమ్ లోనూ నటించి మెప్పించింది ఈ బ్యూటీ. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ తెలుగు లోనే కాకుండా.. తమిళ్, మలయాళ ఇండస్ట్రీ లోనూ వరుస సినిమాలు చేస్తూ దూసుకుపోతుంది. కేవలం సినిమాల్లోనే కాకుండా.. అటు సోషల్ మీడియా లోనూ ఫుల్ యాక్టివ్‏గా ఉంటుంది ఈ చిన్నది. ప్రస్తుతం తెలుగులో వరుస సినిమాలు చేస్తూ బిజీగా ఉంది ముద్దుగుమ్మ. 



ఇది ఇలా ఉండగా.. తాజాగా ఓ ఇంటర్వ్యూ లో పాల్గోన్న అనుపమ తన వ్యక్తి గత జీవితం గురించి ఆసక్తికర కామెంట్స్ చేసింది.. అందులో భాగంగా తన వ్యక్తి గత విషయాలను పంచుకుంది.కొన్ని పాత్రలు చేసి బయటకొచ్చిన తర్వాత అవి మనసుల్ని వెంటాడుతుంటాయి. అయితే చాలా వరకు రెండు జీవితాల ను వేర్వేరుగా ఉండేలా చూసుకుంటుంటాను.. పర్సనల్ విషయాల ను పెట్టు కొని నటించను అని చెప్పుకొచ్చింది.. నిజ జీవితంలో నేను ప్రేమలో పడ్డాను.. విడిపోయాను. అలాగని సెట్లో ప్రేమ సన్నివేశాల్లో నటించేటప్పుడు నా ప్రేమను గుర్తుచేసుకోను. 



అలాంటి ప్రేమ పాత్రల్లొ నటించాను కానీ ఎప్పుడూ ఫీల్ అవ్వలేదు అంటూ అనుపమ చెప్పింది. ఈ విషయం పై నెటిజన్లు రకరకాలుగా కామెంట్లు పెడుతున్నారు.. మొత్తానికి తన గురించి బయట పెట్టింది.. ఇది ఇప్పుడు సోషల్ మీడియాలొ వైరల్ అవుతుంది.

సినిమాల విషయాన్నికొస్తే..రౌడీ బాయ్స్, కార్తికేయ 2, 18 పేజీస్ సినిమాలు త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానున్నాయి.  

మరింత సమాచారం తెలుసుకోండి: