ప్రస్తుతం స్క్రిప్ట్ వర్క్ జరుగుతున్న ఈ సినిమా మార్చి లో సెట్స్ మీదకు వెళ్లనున్నట్లు సమాచారం. హారికా హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై రూపొందనున్న ఈ సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తోంది. ఇటీవల అధికారిక అనౌన్స్ మెంట్ వచ్చిన ఈ సినిమా ప్రారంభానికి ముందే పలువురు మహేష్ ఫ్యాన్స్ దర్శకుడు త్రివిక్రమ్ ని ఉద్దేశించి సోషల్ మీడియా మాధ్యమాల్లో ఈ విధంగా కామెంట్స్ చేస్తున్నారు. వాస్తవానికి అతడు మంచి విజయం అందుకున్నప్పటికీ ఖలేజా మాత్రం ఫ్లాప్ అయిందని, అయితే ఫ్లాప్ అయినప్పటికీ కూడా ఆ మూవీ ప్రస్తుతం టివిలో ప్రసారం అవుతూ మంచి క్రేజ్, రేటింగ్స్ అందుకోవడం బాగున్నప్పటికీ, తమ హీరోతో త్రివిక్రమ్ ఒక పెద్ద బ్లాక్ బస్టర్ సక్సెస్ఫుల్ మూవీ తీయాలని కోరుతున్నాం తప్ప ఇలా రిలీజ్ తరువాత ప్లాప్ అయి, అనంతరం టివి ఆడియన్స్ ని మెప్పించే కల్ట్ క్లాసిక్స్ తమకు వద్దంటే వద్దని ఆయనని కోరుతూ కామెంట్స్ చేస్తున్నారు.
మరోవైపు ఈ సినిమాపై మహేష్ ఫ్యాన్స్ తో పాటు యావత్ టాలీవుడ్ ఆడియన్స్ అందరిలో కూడా భారీ అంచనాలు ఉన్నాయి. అందుతున్న సమాచారం ప్రకారం ఎంతో భారీ గ్యాప్ తరువాత సూపర్ స్టార్ తో తాను చేస్తున్న మూవీ కావడంతో దీనిని ఎలాగైనా అతి పెద్ద సక్సెస్ చేసేలా త్రివిక్రమ్ మూవీ స్టోరీ, స్క్రిప్ట్ విషయమై ఎంతో జాగ్రత్తగా వ్యవహరిస్తున్నట్లు టాక్. మరి ఇదే కనుక నిజం అయి, రేపు రిలీజ్ తరువాత ఈ సినిమా భారీ సక్సెస్ కొడితే మహేష్ ఫ్యాన్స్ ఆనందానికి అవధులు ఉండవు అనే చెప్పాలి.