ఇక ఇప్పుడు ఎవరి మొబైల్స్ లో చూసిన .. ఎక్కడ విన్నా.. ఏ ఫంక్షన్ ల కు వెళ్లినా కానీ సిద్ద్ శ్రీరామ్ పాడిన పాటలే ఎక్కువుగా వినిపిస్తుంటాయి. అంతలా సిద్ శ్రీరామ్ పాటలకు అడిక్ట్ అయ్యిపోయారు జనాలు దీంతో ఆయనకు ఆఫర్స్ క్యూ కడుతున్నాయి. ఇక రీసెంట్ గా పుష్ప సినిమాలో ఆయన పాడిన శ్రీవల్లి పాట ఎంత బ్లాక్ బస్టర్ అయ్యిందో మనకు తెలిసిందే. "నిన్ను చూస్తూ ఉంటే కన్నులు రెండూ తిప్పేస్తావే"..అంటూ అతని తీయ్యటి గొంతుతో ఈ పాట పాడుతుంటే స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్ కూడా ఫిదా అయిపోయారు ఆ వాయిస్ కి.
అందుకే అంటుంటారు అందరు ఆయన వాయిస్ లో ఏదో తెలియని మాయ, మ్యాజిక్ ఉంది అని. అందుకే ఎలాంటి వారినైన ఆయన పాడిన పాటలు అట్రాక్ట్ చేస్తుంటాయట. ఇక ఈ మధ్య కాలంలో హిట్ అయిన పాటలు అన్నీ కూడా ఆయనే పాడటం ఇక్కడ మనం గమనించాల్సిన విషయం. ఇక ఇంత డిమాండ్ ఉన్న పాపులర్ సింగర్ ఒక్క పాటకు ఎంత రెమ్యూనరేషన్ తీసుకుంటాడో తెలుసా..4-5 లక్షలు వరకు తీసుకుంటారట. జనరల్ గా ఇంత రెమ్యూనరేషన్ ఏ సింగర్ కి ఇవ్వరు..కానీ ఆయన పాటలకు ఉన్న డిమాండ్ బట్టి మ్యూజిక్ డైరెక్టర్స్ కూడా ఎక్కడ తగ్గకుండా భారీ పారితోషకాని ఇవ్వడానికి రెడీ అవుతున్నారట. నిజం చెప్పాలంటే మిగతా సింగర్స్ తో కంపేర్ చేస్తే సిద్ద్ శ్రీరామ్ పారితోషకం చాలా ఎక్కువే కానీ యూత్లో ఆయనకు ఉన్న క్రేజ్ కారణంగా ఆయన అడిగినంత ఇస్తున్నారట.