టాలీవుడ్ లో ఉన్న స్టార్ హీరోల్లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఒకరు. ప్రేక్షకుల్లో పవన్ కు ఉండే ఫాలోయింగే వేరు. ఆయన సినిమాలకు ప్రీరిలీజ్ బిజినెస్ కూడా కోట్లలో జరుగుతుంటుంది.ప్రస్తుతం పవన్ నటిస్తోన్న రెండు సినిమాలు సెట్స్ పై ఉన్నాయి. వాటిలో మొదటి సినిమా 'భీమ్లానాయక్' ఒకటి. ఈ సినిమా కి సాగర్ చంద్ర దర్శకత్వంవహిస్తున్నారు. ఈ సినిమాకి సంబంధించిన అన్ని పనులు కూడా త్రివిక్రమ్ దగ్గరుండి చూసుకుంటున్నారు. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై సూర్యదేవర నాగవంశీ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.యస్ యస్ తమన్ సంగీతం అందిస్తోన్న ఈ సినిమా ఆడియో హక్కులను టిప్స్ సంస్థ ఐదున్నర కోట్ల రూపాయలకు చేజిక్కించుకుందని సమాచారం తెలుస్తుంది. ఇప్పటికే విడుదలైన 'బీమ్లానాయక్' సినిమా లిరికల్ సాంగ్స్ కి మంచి రెస్పాన్స్ వస్తోంది. 

ఫిబ్రవరి 25 వ తేదీన ఈ సినిమా విడుదల కానుంది.ఇక ఈ సినిమాతో పాటు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ 'హరిహర వీరమల్లు' అనే మరో భారీ బడ్జెట్ సినిమాలో కూడా నటిస్తున్నారు. క్రిష్ దర్శకత్వం వహిస్తోన్న ఈ భారీ బడ్జెట్ చిత్రాన్ని ఏఎం రత్నం నిర్మిస్తున్నారు.ఎం.ఎం.కీరవాణి సంగీతం అందిస్తోన్న ఈ చిత్రం ఆడియో రైట్స్ ని కూడా టిప్స్ సంస్థ దక్కించుకుందని తెలుస్తోంది. ఏకంగా నాలుగున్నర కోట్లు చెల్లించినట్లు సమాచారం తెలుస్తోంది.ఇక 'భీమ్లానాయక్' చిత్రాన్ని ముందుగా పూర్తి చేయాలనే ఉద్దేశంతో 'హరిహర వీరమల్లు' చిత్రాన్ని పక్కన పెట్టారు. త్వరలోనే ఈ చిత్రం కొత్త షెడ్యూల్ ను కూడా మొదలుపెట్టనున్నారు.ఇక ఇటీవలే దర్శకుడు క్రిష్ తో పవన్ కళ్యాణ్ స్టోరీ సిట్టింగ్స్ లో పాల్గొన్నారు. ఈ ఏడాదిలోనే ఈ సినిమా విడుదల కానుందని సమాచారం తెలుస్తుంది.ఈ సినిమా పై అభిమానుల్లో భారీ అంచనాలే వున్నాయి. ఖచ్చితంగా రికార్డులు తిరగరాస్తుందని నమ్ముతున్నారు.చూడాలి ఈ మూవీ ఎంత పెద్ద హిట్ అవుతుందో.

మరింత సమాచారం తెలుసుకోండి: