ఉమ్మడి అనంతపూర్ జిల్లా హిందూపురం నియోజకవర్గంలో మరోసారి టీడీపీ విజయం సాధించాలని బాలయ్య అభిమానులు, టీడీపీ నేతలు, కార్యకర్తలు భావిస్తున్నారు. హిందూపురంలో బాలయ్య గెలుపు కోసం ఆయన భార్య వసుంధర పడుతున్న పాట్లు హాట్ టాపిక్ అవుతున్నాయి. గత కొన్ని వారాలుగా హిందూపురం ప్రచారానికే వసుంధర పరిమితం కావడంతో కావడంతో పాటు హిందూపురం నియోజకవర్గానికి బాలయ్య చేసిన అభివృద్ధి గురించి ప్రచారం చేస్తున్నారు.
 
సూపర్ సిక్స్ కరపత్రాలను పంచడంతో పాటు మహిళా కూలీలతో కలిసి రాగి కంకులు కోస్తూ ఆమె వార్తల్లో నిలిచారు. బాలయ్యను మూడోసారి నియోజకవర్గంలో గెలిపించాలంటూ ఓటర్లను ఆకట్టుకునేలా ఆమె విజ్ఞప్తి చేశారు. బాలయ్య మరోసారి ఎమ్మెల్యేగా గెలిస్తే హిందూపురం మరింత అభివృద్ధి చెందడం ఖాయమని వసుంధర పేర్కొన్నారు. బాలయ్యను మరోసారి దీవించాలని ఆమె కోరుతున్నారు.
 
2019 ఎన్నికల సమయంలో సైతం బాలయ్య తరపున వసుంధర ప్రచారం చేయగా బాలయ్య ఆ సమయంలో ఎమ్మెల్యేగా గెలిచారు. వసుంధర ప్రచారం సెంటిమెంట్ బాలయ్యకు కలిసొస్తే ఈ ఎన్నికల్లో కూడా బాలయ్య సులువుగానే గెలిచే ఛాన్స్ అయితే ఉంటుందని పొలిటికల్ వర్గాల్లో వినిపిస్తోంది. బాలయ్య ఈ నెల 22వ తేదీన హిందూపురం నియోజకవర్గంలో నామినేషన్ దాఖలు చేశారు.
 
మరోవైపు బాలయ్య నామినేషన్ కు ఏవైనా ఇబ్బందులు కలిగే అవకాశం ఉన్న నేపథ్యంలో వసుంధర కూడా హిందూపురం నుంచి నామినేషన్ వేశారని ప్రచారం జరుగుతోంది. ఈ ప్రచారంలో నిజానిజాలు తెలియాల్సి ఉంది. బాలయ్య నామినేషన్ కు సంబంధించి ఎలాంటి ఇబ్బందులు లేవని తెలిస్తే ఆమె తన నామినేషన్ ను విత్ డ్రా చేసుకునే ఛాన్స్ ఉంది. బాలయ్య గెలుపు కోసం వసుంధర పడుతున్న కష్టానికి నెటిజన్లు ఫిదా అవుతున్నారు. వసుంధర లాంటి భార్య ఉండటం బాలయ్య అదృష్టమని మరి కొందరు నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. రాబోయే రోజుల్లో వసుంధర సైతం రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వాలని బాలయ్య ఫ్యాన్స్ కామెంట్లు చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: